మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు హైకోర్టులో షాక్ తగిలింది. బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటీషన్ ను కొద్దిసేపటి క్రితం హైకోర్టు కొట్టివేసింది. అచ్చెన్నాయుడుతో పాటు ఇతర నిందితులు మురళీ, సుబ్బారావు, రమేష్ కుమార్ ల బెయిల్ పిటీషన్ లను కూడా కోర్టు తోసిపుచ్చింది.
ఈఎస్ఐ స్కామ్ లో నిందితులుగా వీరిని అవినీతి నిరోధక శాఖ అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. 151 కోట్ల రూపాయల మేరకు అవకతవకలకు వీరు ప్రధాన కారణమన్నది ఈ నిందితులపై ఉన్న అభియోగం. ప్రభుత్వం తరుపు న్యాయవాదులు ఒకవేళ బెయిల్ మంజూరు చేసినట్లయితే విచారణకు ఆటంకం కలుగుతుందని భావించారు. ప్రభుత్వం తరుపు న్యాయవాదుల వాదనలతో కోర్టు ఏకీభవించింది. ప్రస్తుతం అచ్చెన్నాయుడు గుంటూరు రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెల్సిందే.