Cinema Tickets: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఎప్పటికప్పుడు మొట్టికాయలు వేస్తూ వస్తోంది. తాజాగా సినిమా టికెట్ ధరలను నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి ఎంతమాత్రమూ లేదని హెచ్చరించింది. అంతిమంగా ధరలను నిర్ణయించేది లైసెన్సింగ్ అథార్టీయేనని ఈ నేపథ్యంలో స్పష్టం చేసింది. అలాగే ఆన్లైన్లో సినిమా టికెట్లు విక్రయించేటప్పుడు సర్వీసు ఛార్జీలను టికెట్ ధరల్లో కలపడానికి వీల్లేదని కూడా తాజా జీవోలో స్పష్టం చేసింది. పాత విధానంలో టికెట్లను విక్రయించుకోవచ్చని మల్టీప్లెక్స్ యాజమాన్యాలకు సూచించడం కొసమెరుపు. దాంతో మల్టీప్లెక్స్ యాజమాన్యాలు పండగ చేసుకుంటున్నాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Cinema Tickets: జీవో పూర్తి వివరాలు:
హైకోర్టు న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ DVSS సోమయాజులు బుధవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇక్కడ కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను జూన్ 15కు వాయిదా వేయడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మల్టీప్లెక్స్ థియేటర్ల టికెట్ ధరల్లోనే సర్వీసు ఛార్జీలను చేర్చుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 7న జీవో ఇచ్చిన సంగతి విదితమే. ఈ క్రమంలో ఆన్లైన్ టికెట్ విక్రయాలపై సందేహాలు, నిధులు దుర్వినియోగం, మళ్లింపు వంటివి జరుగుతాయని ఆందోళన అక్కర్లేదని తెలపడం గమనార్హం.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మరింత సమాచారం:
ప్రభుత్వం, సదరు యాజమాన్యాలను సంప్రదించకుండా వారు అందిస్తున్న సౌకర్యాలపై ఓ అభిప్రాయానికి రావడానికి వీల్లేదని అన్నారు. థియేటర్ యాజమాన్యాలు ప్రేక్షకులకు ఆన్లైన్ బుకింగ్ కల్పిస్తున్నాయని, అలాంటప్పుడు మీరు ప్రత్యేకించి ఆన్లైన్ విధానాన్ని పెట్టాల్సిన పని లేదని హైకోర్టు స్పష్టం చేసింది. లైన్లో నిల్చునే పని లేకుండా ఎక్కడి నుంచైనా టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటు థియేటర్లు కల్పించినపుడు ప్రభుత్వ జోక్యం ఇందులో కల్పించుకోవద్దని హెచ్చరికలు జారీ చేసింది.