కరోనా వైరస్ పరీక్షల విషయంలో తెలంగాణ సర్కార్ కి ఇప్పటికే పలుసార్లు న్యాయస్థానాలు అదే విధంగా కేంద్ర ప్రభుత్వం మొట్టికాయలు వేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ టెస్టులను సరిగ్గా నిర్వహించడం లేదని అందువల్లనే వైరస్ ఉన్న కొద్ది ప్రబలుతోంది అంటూ అప్పట్లో తెలంగాణ సర్కార్ పై సీరియస్ అవ్వడం జరిగింది. అయినా గాని ప్రభుత్వంలో చలనం లేదు అని అటు అధికారుల నుండి ప్రజల నుండి కూడా విమర్శ ఎదురవుతోంది.
తాజాగా ఇదే విషయంపై కేసిఆర్ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అన్నట్టుగా హెచ్చరించింది. ఇటీవల ఇదే విషయంపై దాఖలైన పిటీషన్స్ పై విచారించిన హైకోర్టు రాష్ట్రంలో కరోనా వైరస్ టెస్టుల సంఖ్య పెంచాలని, అలాగే మరణించిన వారికి కూడా కరోనా వైరస్ టెస్టులు చేయించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ఈ విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది, అలాగే ఈ సరి ఇచ్చిన ఆదేశాలు బేఖాతరు చేస్తే కోర్టు ధిక్కరణ చర్యలకు పాల్పడినట్లు ప్రభుత్వానికి సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖ అధికారుల పై సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని హైకోర్టు హెచ్చరించింది.
ఈ సమయంలో సుప్రీంకోర్టులో తీర్పు కు సంబంధించిన వాదనలు నడుస్తున్న కారణంగా పరీక్షలు నిర్వహించడం లేదని అడ్వకేట్ జనరల్ ఈ సందర్భంగా కోర్టు తెలియజేయడంతో… సుప్రీంకోర్టులో తీర్పు వచ్చేవరకు హైకోర్టు తీర్పు అమలు చేయాల్సిందేనని హైకోర్టు సూచించింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?