ఆలీగఢ్(ఉత్తర్ప్రదేశ్), జనవరి30: జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి రోజున దేశమంతా ఆ మహాపురుషుడికి నివాళులు అర్పిస్తుండగా హిందూ మహాసభ ఆయన హత్యను పండగ చేసుకున్నది. మహాత్మా గాంధీ దిష్టిబొమ్మను తుపాకీతో కాల్చి, ఆపై గాంధీ హంతకుడు నాధూరాం గాడ్సేకు నివాళులు అర్పించిన ఈ దిగ్భ్రాంతికర సంఘటన ఆలీగడ్లో చోటుచేసుకున్నది.
ఉత్తర్ప్రదేశ్లోని అలీగఢ్లో హిందూ మహాసభ జాతీయ కార్యదర్శి పూజా షకున్ పాండే గాంధీజీ దిష్టిబొమ్మను బొమ్మ తుపాకీతో కాల్చినట్లు పోజు ఇచ్చారు. అనంతరం మహ్మాత్ముడిని హత్య చేసిన నాధూరామ్ గాడ్సేను వీరుడిగా కొనియాడుతూ అతని ఫోటోకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. తర్వాత స్వీట్లు పంపిణీ చేశారు.
Hindu Mahasabha recreates Mahatma Gandhi’s assassination, Shoots Bapu’s effigy.
** Will they be Labelled Anti National
or Called Tukde Tukde Gang
or be Booked for SEDITION ? #MahatmaGandhi #martyrsday #MahatmaGandhiDeathAnniversary pic.twitter.com/U666ZRSUm1— Aarti (@aartic02) January 30, 2019