కరోనా వైరస్ ఉద్రిక్తత తో దేశంలో మహానగరాలు బెంబేలెత్తాయి. చాలాచోట్ల జనాలు పట్నం విడిచి పల్లెకు పరుగులు పెట్టారు. దీంతో ఫస్ట్ గ్రేడ్ సిటీ లలో అద్దె ఇల్లతో పాటు గృహాల కొనుగోలుకు గిరాకి తగ్గి ద్వితీయ తృతీయ శ్రేణి నగరాల్లో డిమాండ్ పెరిగిపోయింది. జంట నగరాల నుండి కార్మికులు స్వస్థలాలకు వెళ్లటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడినట్లు హౌసింగ్ డాట్ కామ్ తాజాగా నిర్వహించిన సర్వేలో వెల్లడించింది.
గృహాలకు డిమాండ్ పెరిగిన చిన్న నగరాలలో విజయవాడ, అమృత్సర్, చండీగర్, నాగపూర్ వున్నాయి. కార్మికుల వలస, వర్క్ ఫ్రొం హోమ్ ట్రెండ్ రాబోయే రోజుల్లో మరింత ప్రభావం చూపే అభిప్రాయం సర్వేలో వ్యక్తమయింది. సెకండ్, థర్డ్ గ్రేడ్ నగరాలలో అద్దె ఇల్లు, గృహాలు కొనుగోలు డిమాండ్ ఆగస్టులోనే మూడు రెట్లు పెరిగింది.
అన్ లాక్ 4 తరువాత ఈ నగరాలలో వర్చువల్, రెసిడెంటిల్ డిమాండ్ ఇండెక్స్ 210 పాయింట్లకు పెరగగా…. దేశంలో మరో ఆరు ప్రధాన నగరాలలో ఇది 110 పాయింట్లకు పరిమితమైంది. గృహ నిర్మాణ రంగం మెల్ల మెల్లగా పుంజుకోవడం నిజంగా శుభ పరిణామమని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం పరిస్థితులు చేయి దాటి పోయినా గానే ఉన్న కొద్దీ దేశం మరియు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెల్లమెల్లగా పుంజుకుంటుందని విశ్లేషిస్తున్నారు. ఇక వచ్చే ఏడాది ప్రారంభం కల్లా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ఇంక వెనక్కి తిరిగి చూసుకునే ప్రసక్తి లేదని పేర్కొంటున్నారు.