జగన్ ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్న తర్వాత చాలా వరకు ప్రభుత్వ పనులను తన రెండు కళ్ళు లాంటి వాలంటీర్ల వ్యవస్థ గ్రామ సచివాలయం తో కాని స్తూనే మరోపక్క ప్రభుత్వ అధికారులతో పనులు చేయిస్తున్నారు. అంతేకాకుండా అధికారులకు పూర్తి స్వేచ్ఛ కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి తరుణంలో కొంతమంది అధికారులు సీఎం జగన్ ఇచ్చిన స్వేచ్ఛని అలుసుగా తీసుకున్నట్లు ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి.
ముఖ్యంగా సీఎం జగన్ ఎక్కువగా దృష్టి పెట్టే గ్రామాల విషయాల్లో అధికారులు అసలు పట్టించుకోవడం లేదు అనే ఫిర్యాదులు సీఎం జగన్ దృష్టి దాకా వచ్చినట్లు టాక్. అంతేకాకుండా అధికారులు వాలంటీర్లతో కోఆర్డినేట్ కాకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు…. పరిపాలన విషయంలో కాకుండా అవినీతి వ్యవహారాల్లో అధికారులు తలదూర్చి అనవసర విషయాల్లో కలగజేసుకుంటూన్నట్లు టాక్. అధికారులు ఎక్కువ అవినీతికి పాల్పడుతున్నట్లు నివేదిక తాజాగా జగన్ ఛాంబర్ లో ఉన్నట్లు సమాచారం.
దీంతో సీఎం జగన్ అధికారుల విషయంలో చాలా కోపంగా ఉన్నట్లు ఇప్పుడు ఇదే సచివాలయ కార్యాలయాల్లో పెద్ద డిస్కషన్ అని మీడియా వర్గాల్లో వినబడుతున్న టాక్. ఎవరెవరు ఇప్పటి వరకు రెవెన్యూ శాఖ విషయంలో అవినీతికి పాల్పడ్డారో బయటకు తీసుకురావటానికి జగన్ ప్రత్యేకంగా ఓ కమిటీ వేయటానికి రెడీ అయినట్లు సమాచారం. భూముల పాస్ బుక్ ల విషయంలో తలదూర్చిన అధికారులపై కూడా జగన్ దృష్టి పెట్టినట్లు…ఇప్పటివరకు పాలనాపరంగా అధికారులు చేసిన ప్రోగ్రాస్ తెప్పించుకుని పరిశీలించనున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో వినబడుతున్న టాక్. దీంతో ప్రభుత్వ అధికారుల పనితీరుపై జగన్ చాలా కోపంగా ఉండటంతో ఈ విషయం ఇప్పుడు ఏపీ సచివాలయంలో అదేవిధంగా క్యాబినెట్ మంత్రులలో పెద్ద హాట్ టాపిక్ అయినట్లు సమాచారం.