వైయస్ జగన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ కి సంబంధించి మూడు రాజధానుల కాన్సెప్ట్ విషయంలో న్యాయ వ్యవస్థ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. రాజధాని రైతులు హైకోర్టులో ఈ విషయం గురించి పోరాడుతున్నారు. ఇలాంటి తరుణంలో ఏపీ ప్రభుత్వం చాలా వరకు వెనకడుగు వేసినట్లు మొన్నటివరకు అనిపించింది. అయితే తాజాగా మరో కొత్త రూట్ లో జగన్ రాజధాని తరలింపు ఈ కార్యక్రమానికి రెడీ అయినట్లు దానికి దసరా పండుగ నీ ముహూర్తంగా ఖరారు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. పూర్తి విషయంలోకి వెళితే విశాఖలో రాజధాని నిర్మాణానికి సంబంధించి సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వైసీపీ పార్టీలో అంతర్గతంగా వినపడుతున్న టాక్.
క్లియర్ గా విషయం లోకి వెళ్లిపోతే విశాఖపట్టణంలో 150 కోట్లతో సచివాలయం నిర్మించడానికి జగన్ రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే స్థల సేకరణ కూడా జరిగినట్లు సమాచారం. ఇదిలా ఉండగా త్వరలోనే అమరావతి నుండి సచివాలయం విశాఖపట్టణానికి తరలించడానికి… ప్రభుత్వ భూమి లోనే టెంపరరీగా ఓ భవనాన్ని నిర్మించడానికి ఏపీ క్యాబినెట్ మంత్రులు రెడీ అయినట్లు త్వరలోనే భూమి పూజ కి సీఎం జగన్ రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే ఏపీ రాజధాని విషయంలో హైకోర్టు స్టేటస్ కో అక్టోబర్ 5 వరకు పెంచిన సంగతి తెలిసిందే. అయినా కానీ జగన్ వైజాగ్ ప్రాంతానికి రాజధాని తరలింపు విషయంలో చాలా దూకుడుగా వ్యవహరించడంతో జగన్ తీసుకున్న ఈ రెబెల్ డెసిషన్ కి హైకోర్టు న్యాయమూర్తులు ఎలా రియాక్ట్ అవుతారో అన్నది సస్పెన్స్ గా మారింది. మరోపక్క ప్రస్తుతం సీఎం జగన్ ఉన్న కాన్ఫిడెన్స్ బట్టి చూస్తే ఇటీవల ఢిల్లీ యాత్రలో పూర్తిగా కేంద్రం యొక్క ఆశీస్సులు ఉన్నట్లు… అందువల్ల ఈ రీతిలో నిర్ణయాలు తీసుకుంటున్నట్లు పరిశీలకుల మాట. పైగా కేంద్రం లో కూడా జగన్ పార్టీకి ఉన్న కొద్ది డిమాండ్ పెరుగుతుండటంతో ఈ విషయంలో న్యాయస్థానాలు కూడా చేసేదేమీ ఉండదు అని టాక్ వినబడుతోంది.