సరిగ్గా నలభై రోజులు ఉన్నాయి అమెరికా అధ్యక్ష ఎన్నికలకు. దీంతో అధికారం సంపాదించడానికి రిపబ్లిక్ మరియు డెమోక్రటిక్ పార్టీలు నువ్వానేనా అన్నట్టుగా ప్రచారం చేస్తున్నాయి. రిపబ్లిక్ పార్టీ తరుపున అధ్యక్షుడు ట్రంప్ తనదైన శైలిలో దూసుకుపోతు ఉండగా…. డెమోక్రాటిక్ పార్టీ తరపున బైడెన్ కి మద్దతు రోజురోజుకీ పెరుగుతూ ఉంది. దీంతో ఎవరికి వారు వ్యూహాలు వేసుకుంటూ దూసుకుపోతున్నారు. బైడెన్ ప్రచారంలో కరోనా వైరస్ నీ అడ్డం పెట్టుకుని ట్రంపు పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
మహమ్మారిని అడ్డుకునే విషయంలో ట్రంప్ పూర్తిగా ఫెయిల్ అయ్యారని తెగ ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మరో పక్క డోనాల్డ్ ట్రంప్ కి మొదటి నుండి మీడియా వ్యతిరేకమని అందరికీ తెలిసిన విషయమే. దీంతో చాలావరకు సర్వేలు ట్రంప్ ఓడిపోతున్నట్లు అమెరికా మీడియా పెద్ద ఎత్తున్న రిజల్ట్స్ చూపిస్తున్నాయి. ముఖ్యంగా నల్లజాతీయులు డోనాల్డ్ ట్రంప్ నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చాలా సర్వేలో తేలినట్లు అమెరికా మీడియా వార్తలు తెగ వైరల్ చేస్తున్నాయి. చాలా సర్వేలలో బైడెన్ గెలవటం గ్యారెంటీ అని ఫలితాలు వస్తున్నాయి.
సరిగ్గా అమెరికాలో పరిస్థితి చూస్తే 2019 సార్వత్రిక ఏపీ ఎన్నికల గుర్తులు ఉన్నాయని తాజాగా విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కి వ్యతిరేకంగా మీడియా ఎలా పని చేసిందో గతంలో ఏపీలో మీడియా జగన్ కి సార్వత్రిక ఎన్నికలలో పని చేయడం జరిగిందని పేర్కొన్నారు. జగన్ ఓడిపోవడం గ్యారంటీ అని చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అవుతున్నట్లే అన్నట్టుగా ఎల్లో మీడియా బిల్డప్ ఇచ్చిందని .. కానీ చివరాఖరికి జగనే గెలవడం జరిగింది అని ఆంటున్నారు. ఇప్పుడు ఇదే సీన్ అమెరికాలో రిపీట్ అయ్యే పరిస్థితి ఉంది అని విశ్లేషకులు పోల్చుతున్నారు. కారణం చూస్తే డోనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ విషయంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిపోకుండా చాలా తెలివిగా వ్యవహరించడం జరిగిందని పేర్కొన్నారు. మొత్తంమీద ప్రస్తుత పరిస్థితి బట్టి డోనాల్డ్ ట్రంప్ కి విజయ అవకాశాలు ఎక్కువ గానే ఉన్నాయి అన్నట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు.