జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత సార్వత్రిక ఎన్నికలలో ఓడి పోయిన తర్వాత ఇక సినిమాలకు వెళ్ళి పోతాడు గానీ రాజకీయాలకు ప్యాకప్ చెబుతాడు అన్నట్టు ప్రత్యర్థులు సెటైర్లు వేశారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తన శేష జీవితం మొత్తం రాజకీయాలకే అంటూ ఎట్టిపరిస్థితిలో సినిమాలు చేయను అంటూ ప్రకటనలు చేశారు. దీంతో మెగా అభిమానులు చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ బిజెపి పార్టీతో పొత్తు పెట్టుకోవటంతో పాటు సినిమాలకు ఒప్పుకోవడం జరిగింది.
అయితే రాష్ట్రంలో బీజేపీ పార్టీకి బలం లేని సందర్భంలో పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకోవటం తో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. మరో పక్క తనకు బీజేపీలో అధినాయకత్వం పెద్దపీట వేస్తుందని భావించిన పవన్ మొదటిలో బానే చూసిన తర్వాత ఇటీవల కూరలో కరివేపాకు లాగా పవన్ కళ్యాణ్ ని బిజెపి ఢిల్లీ నేతలు పక్కన పెట్టేస్తున్నారు అనే టాక్ వస్తోంది. ముఖ్యంగా గ్రౌండ్ స్థాయిలో పవన్ కళ్యాణ్ పార్టీ కి ఎటువంటి బలం లేదని తేలిపోవడంతో పవన్ ని లైట్ తీసుకోవాలని ఢిల్లీ బీజేపీ నేతలు ఏపీ బీజేపీ నేతలకు చెప్పినట్లు వార్తలు అందుతున్నాయి.
మరోపక్క రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఎంతగానో విభేదించే వై.ఎస్.జగన్ ని మోడీ ప్రశంసించడం నిజంగా పవన్ కళ్యాణ్ కి పెద్ద షాక్ అనే టాక్ ప్రస్తుతం గట్టిగా వినబడుతోంది. వైయస్ జగన్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పవన్ కళ్యాణ్ బాహాటంగానే వ్యతిరేకిస్తూ ఉంటారు అన్న సంగతి తెలిసిందే. మొదటిలో రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నాకు కులం లేదు మతం లేదు అని చెప్పిన పవన్ తాజాగా మత రాజకీయాలు చేసే రీతిలో వైసీపీని కార్నర్ చేసే విధంగా బిజెపి పెద్దల ప్రసన్నం పొందే రీతిలో అనేక ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇలాంటి తరుణంలో జగన్ తిరుపతి పర్యటనలో శ్రీవారి సన్నిధిలో ప్రధాని మోడీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో జగన్ ని కరోనా వైరస్ కంట్రోల్ చేసే విధానం గురించి పొగడ్తలతో… మోడీ ప్రశంసించడం అటు జాతీయ ఇటు రాష్ట్ర రాజకీయాల్లో హైలెట్ అయ్యింది. ఇదే తరుణంలో బీజేపీకి పెద్దగా ఉన్నా మీరు సైతం జగన్ తో రెండు విడతలుగా బేటీ అవ్వడం సంచలనంగా మారింది. ముఖ్యంగా జగన్ ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శమంటూ మోడీ.. తిరుమల తిరుపతి శ్రీవారి సన్నిధిలో ఉన్న వైఎస్ జగన్ ని పొగడటం.. కొన్ని మీడియా ఛానల్స్ కి అదేవిధంగా కొన్ని రాజకీయ పార్టీలకు షాక్ ఇచ్చినట్లు అయ్యిందని చాలా మంది విశ్లేషకులు ఇటీవల చెప్పుకొస్తున్నారు. మరోపక్క బిజెపి పార్టీ పెద్దల ప్రసన్న పొందడానికి రకరకాల ఫీట్లు చేస్తున్న పవన్ కళ్యాణ్ కి మోడీ గట్టిగానే షాక్ ఇచ్చినట్లు అయిందని విశ్లేషిస్తున్నారు.
ఏది ఏమైనా మత రాజకీయాలు చేసి ప్రజల దృష్టిలో జగన్ ని కార్నర్ చేయాలనుకుంటున్నా రాజకీయ నేతలకు కొన్ని మీడియా ఛానల్స్ కి సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు జవాబు ఇచ్చారు అని వైసీపీ సపోర్టర్లు అంటున్నారు. శ్రీవారు తన పాద సన్నిధిలో జగన్ ని కూర్చోబెట్టుకొని…. దేశానికి ప్రధాని అయిన మోడీ తో ప్రశంసలు కురిపించేటట్లు చేశారని… తాజా పరిణామంపై వైసీపీ పార్టీ వర్గాలు అంటున్నాయి. జగన్ పై మత ముద్ర వేయాలని చూసిన ప్రతి రాజకీయ పార్టీకి, చానల్స్ కి శ్రీ వారే తనదైన శైలిలో ప్రధాని మోడీ రూపంలో జవాబు ఇచ్చారని చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా శ్రీవారి సన్నిధిలో ప్రధానిమంత్రితో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించిన ఏకైకా సీఎంగా ఇలాంటి మత రాజకీయా కుట్రలు చేసే సమయంలో జగన్ రికార్డు సృష్టించారని.. ప్రధాని చేత శబాష్ అనిపించుకున్నారని పేర్కొన్నారు. ఏదిఏమైనా బిజెపి పార్టీ తనని నెత్తిన ఎక్కించుకుంటది అని అనుకున్నా పవన్ కళ్యాణ్ కి ఇది మాత్రం పెద్ద షాకే అని మేధావులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు.