KA Paul: ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ పై ఓ వ్యక్తి చేయి చేసుకున్నాడు. మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించడానికి వెళుతున్న సమయంలో సిద్దిపేట జిల్లా జక్కాపూర్ వద్ద గ్రామస్తులు కేఏ పాల్ వాహనాన్ని అడ్డుకోవడం జరిగింది. ఈ తరుణంలో అడ్డుకున్న వారితో మాట్లాడటానికి దిగిన కెఏ పాల్ పై ఓ వ్యక్తి దాడి చేశాడు. డీఎస్పీ చూస్తుండగానే ఈ దాడి జరిగింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అయితే దాడి చేసిన వ్యక్తి జిల్లెల గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు. టిఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తి అని మీడియా ఛానల్స్ లో వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే తనపై దాడి జరగటంతో కె ఏ పాల్ పోలీసులపై సీరియస్ అయ్యారు. మీరు పోలీసులా..? లేకపోతే టీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతమాత్రమే కాదు మీకు జీతాలు కేటీఆర్ ఇస్తున్నారా..? లేకపోతే ప్రభుత్వం ఇస్తుందా అని ప్రశ్నించారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ లేదా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ ఎవరు కూడా రైతులను పట్టించుకోవడం లేదని ధ్వజ మెత్తారు. రైతుల కోసమే తాను రావడం జరిగిందని తాను వస్తానని చెబితే వచ్చి తీరుతానని… తప్పు చేస్తే ప్రశ్నిస్తాను అన్న తరహాలో కెఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏది ఏమైనా సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ పై పోలీసుల సమక్షంలో దాడి జరగడం తెలుగు రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది.