Breaking News: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే రీతిలో వ్యవహరించారని ఏపీ సిఐడి ఆయన అరెస్ట్ చేయడం తెలిసిందే. దీంతో సుప్రీం కోర్టు లో రఘురామ కృష్ణంరాజు తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేసి షరతులతో కూడిన బెయిల్ మీద ఇటీవల ఆర్మీ హాస్పిటల్ నుండి రిలీజ్ అయి ప్రస్తుతం ఢిల్లీలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఆయనపై ఏపీ సిఐడి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన క్రమంలో .. టీవీ5 అదేరీతిలో ఏబీఎన్ ఛానల్ అనే మీడియా సంస్థల భాగస్వామ్యం ఉన్నట్లు వారితో కుట్ర పన్నినట్లు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా రఘురామకృష్ణంరాజు వ్యవహరించారని ఎఫ్ఐఆర్ లో రెండు మీడియా సంస్థల పేర్లను పొందుపరచటం జరిగింది.
ఇలాంటి తరుణంలో సుప్రీంకోర్టులో ఏపీ సిఐడి విచారణకు సంబంధించి స్టే ఇవ్వాలని ఏబీఎన్ ఛానల్ పిటిషన్ వేయగా .. ఈ విషయంలో తాము కలుగజేసుకునే ప్రసక్తి లేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. దీంతో ఏపీ సిఐడి టీవీ5 అదేవిధంగా ఏబీఎన్ చానల్స్ తో పాటు రఘురామకృష్ణం రాజును విచారించడానికి రెడీ అవుతోంది. మరోపక్క ఇటీవల రఘురామకృష్ణంరాజు షరతులతో కూడిన బెయిల్ తో బయటకు వచ్చిన రఘురామకృష్ణంరాజు ను విచారించాలని అనుకుంటే 24 గంటల ముందు నోటీసులు ఇవ్వాలని సుప్రీంకోర్టు తెలిపింది. పరిస్థితి ఇలా ఉండగా మీడియా సంస్థలను విచారించడానికి సుప్రీం నుండి ఎటువంటి అడ్డంకి లేకపోవడంతో ఏపీ సిఐడి విచారణ ఏ విధంగా వ్యవహరిస్తోంది అన్నది ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?