ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు వస్తున్నా గాని సంబంధిత మంత్రులు వాటిని గత ప్రభుత్వం తో పోలుస్తూ పబ్బం గడుపుతున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. రాజకీయంగా టిడిపి వైసిపి నువ్వానేనా అన్నట్టుగా ముందు నుండి రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్న సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల సమయంలో టిడిపి అధికారంలోకి రాగానే 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ అధికారంలోకి రావడంతో ప్రస్తుతం రాష్ట్రంలో ఎలాంటి దుర్ఘటన జరుగుతున్న….దానికి సంబంధించి వైసీపీ నేతలు చంద్రబాబు ఇంకా అధికారంలో ఉన్నారు అన్న ఫీలింగ్ తో ఆయనపై నెట్టేస్తున్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక బోటు ప్రమాదం జరిగితే సంబంధిత పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ చంద్రబాబునే విమర్శించడం జరిగింది. అలాగే మద్యం విషయంలో వస్తున్న విమర్శలు తిప్పికొట్టే క్రమంలో మంత్రి నారాయణ స్వామి కూడా బాబు పైనే విమర్శలు చేస్తున్నారు. ఇక తాజాగా రాష్ట్రంలో దేవాలయాల పై జరుగుతున్న దాడుల విషయంలో కూడా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా చంద్రబాబు హయాంలో వీటికన్నా మరీ ఎక్కువగా దాడులు జరిగాయని ఆయన్ని అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు.
మొత్తంమీద ఏపీ మంత్రుల తలరాత మొత్తం చంద్రబాబు చేతిలో ఉన్నట్లుగా వ్యవహరిస్తున్నారని చాలామంది ఏపీ మంత్రుల తీరుపై కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రం లో దేవాలయాల పై జరుగుతున్న దాడుల ఈ విషయంలో కొన్ని రాజకీయ అరాచక శక్తులు కావాలని ఏపీ ప్రజల మధ్య మతాల చిచ్చు పెట్టే రీతిలో కుట్ర పన్నుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంలో దుండగులను పట్టుకోకుండా ఏపీ ప్రభుత్వ నేతలు చంద్రబాబునే తలచుకోవటం పట్ల సామాన్య ప్రజలు కూడా వైసీపీ ప్రభుత్వంపై అసహనం చెందుతున్నట్లు టాక్ వస్తోంది.