అధికారంలోకి వచ్చిన నాటి నుండి వైయస్ జగన్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలకు అపాయింట్మెంట్ ఇవ్వటం లేదని ఇష్టానుసారంగా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్లిపోతున్నారని తెగ విమర్శలు వస్తున్నాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ అమలు చేస్తూ ప్రతి ఒక్కరికి బాగానే ఇచ్చిన మాట నెరవేర్చకుంటు వెళ్తున్నారు.
అయితే ఈ సమయంలో నియోజకవర్గానికి సంబంధించి ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో అభివృద్ధి కి సంబంధించి అలాంటి పనులు జరగలేదని సరైన రోడ్డు గాని సాగునీటి ప్రాజెక్టు గాని ఇప్పటి వరకు మొదలు పెట్టలేక పోయాము అంటూ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు సైలెంట్ గా డిస్కషన్స్ పెడుతున్నారట. కొత్తగా ఒక భవనం కట్టకపోయినా ఉన్న ప్రభుత్వ భవనాలకు రంగులు వేయిస్తున్నారు మరి నియోజకవర్గాల అభివృద్ధికి సంబంధించిన పనులు ఎవరు చేస్తారు అని వైసీపీ అధిష్టానంపై మండిపడుతున్నారట.
సంక్షేమం పక్కనబెడితే జరిగిన అభివృద్ధిని చూపించుకుంటూ వచ్చే ఎన్నికల్లో ప్రజలలోకి వెళ్లాలి కదా?, దీని గురించి హైకమాండ్ ఆలోచించదా ?, అంటూ వైసీపీ ఎమ్మెల్యేలు లోలోపల తెగ చర్చలు జరుపుతున్నారట. జగన్ ఈ విధంగానే వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల లోపు పార్టీ నుండి ఎమ్మెల్యేలు చాలామంది జంప్ అయ్యే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.