భారత్- చైనా సరిహద్దు ల మధ్య యుద్ధ వాతావరణం చోటు చేసుకుంది. ఈ ఏడాది జూన్ 15వ తారీకు గాల్వన్ లోయా దగ్గర భారత సైనికులను 20 మందిని పొట్టనబెట్టుకున్న చైనా తో అప్పుడే యుద్ధానికి సిద్ధమైనట్టుగా ఇండియా బలగాలు వ్యవహరించాయి. కానీ తర్వాత ఇరుదేశాల ఆర్మీ నేతలు సామరస్య వాతావరణంలో మాట్లాడుకోవడం తో చర్చలు సఫలమయ్యాయి. కానీ ఇటీవల డ్రాగన్ కంట్రీ సరిహద్దు ప్రాంతాల వద్ద యుద్ధ రీతిలో విన్యాసాలు చేస్తూ పలు అక్రమానాలకు పాల్పడే రీతిలో కవ్వింపు చర్యలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో…. భారత్ కూడా అదేరీతిలో చైనా కి జవాబు చెప్పడానికి రెడీ అయింది.
దీంతో సరిహద్దు ప్రాంతాల వద్ద యుద్ధ విమానాలతో భారత్ ఆర్మీ రౌండ్ లు కొడుతుంది. యుద్ధ విమానాలు, గర్జించే రీతిలో యుద్ధ ట్యాంకులు తో గల్వాన్ లోయ దగ్గర మోహరించాయి. డ్రాగన్ కంట్రీ తో తాడోపేడో తేల్చుకోవడానికి సై అంటుంది భారత సైన్యం. ఇటీవల భారత్ భూభాగాలను ఆక్రమించాలని చైనా చేసిన ప్రయత్నాలను భారత సైన్యం దీటుగా తిప్పి కొట్టింది. చైనా ఎత్తులకు భారత్ పై ఎత్తులు వేస్తూ వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నాయి భారత బలగాలు.
ప్రస్తుతం సరిహద్దు ప్రాంతాల వద్ద పరిస్థితి చూస్తే ఇరుదేశాల యుద్ధ ట్యాంకులు ఎదురెదురుగా దాడి చేసుకునే అంత దగ్గరలో ఉన్నాయి. ఇరు దేశాలు ఎలీసి ప్రాంతం దగ్గర లక్ష మంది సైన్యం చొప్పున మోహరించి నట్లు సమాచారం. భారీ ట్రక్కులు ఆయుధ సామాగ్రిని చేరవేస్తున్నాయి. ఏ చిన్న సంఘటన జరిగినా భారీగా విధ్వంసం తప్పక పోవచ్చని పరిస్థితి ఏర్పడింది. చాలా వరకు యుద్ధం జరిగే అవకాశం ఉన్నట్లు అంతర్జాతీయ మీడియాలో ఇండియా చైనా సరిహద్దు గొడవ పెద్ద హాట్ టాపిక్ అయింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?