ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ నీ భారత్ దీటుగా ఎదుర్కొంటుంది. మొదటి నుండి కరోనా తో పోరాటం విషయంలో అభివృద్ధి చెందిన మరియు సంపన్న దేశాలు చేతులెత్తేసిన పరిస్థితి నెలకొనగా భారత్ మాత్రం పోరాడుతూనే ఉంది. లాక్ డౌన్ తర్వాత ఒక్కసారిగా పాజిటివ్ కేసులు ఊహించని రీతిలో వచ్చినా గానీ కరోనా రికవరీ రేటు విషయంలో భారత్ అద్భుతమైన ఫలితాలు సాధించడం ప్రపంచానికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దేశంలో ప్రస్తుతం కరోనా నుండి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో రికవరీ 68.32గా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
అంతేకాకుండా దేశంలో కరోనా నుండి 15 లక్షల మంది కరోనా ని జయించినట్లు విజేతలుగా నిలిచినట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న కేసుల తో పోల్చితే కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య తొమ్మిది లక్షలు ఎక్కువ ఉందని పేర్కొంది. దేశంలో కరోనా మరణాలు రేటు క్రమక్రమంగా తగ్గుతుందని, ప్రస్తుతం రెండు శాతం ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. మొత్తంమీద చూసుకుంటే మహమ్మారి కరోనా ని భారతీయులు చాలా గట్టిగా ఎదుర్కొంటున్నట్లు, ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన వైద్యనిపుణులు భారత్ లో కరోనా స్టేటస్ తెలుసుకొని అభివర్ణిస్తున్నారు.