ఈ ఏడాది జూన్ 15 మాసం నుండి డ్రాగన్ కంట్రీకి ఇండియాకి మధ్య గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. భారత్-చైనా సరిహద్దు ప్రాంతం గాల్వాన్ లోయలో భారత్ కి చెందిన 20 మంది ఆర్మీ జవాన్లను చైనా పొట్టనబెట్టుకోవడంతో.. చైనా దేశానికి చెందిన యాప్ లపై నిషేధం విధిస్తూ కేంద్రం దీటైన సమాధానం చెబుతూనే వచ్చింది. ఆ తర్వాత అదే సరిహద్దు గొడవలో చైనా దేశానికి చెందిన సైనికులను కూడా మన వాళ్లు హతమార్చడం ప్రపంచ స్థాయిలో పెను సంచలనంగా మారింది. దాదాపు ఆ సమయంలో రెండు దేశాల మధ్య యుద్ధం ఖాయమని అందరూ భావించారు.
ఆ సమయంలో చైనా చర్చలు అంటూ దొంగ నాటకాలు ఆడి ప్రస్తుతం భారత్ పై యుద్ధానికి పాకిస్తాన్ అదే విధంగా మరికొన్ని దేశాలతో మంతనాలు జరుపుతోంది. పరిస్థితి ఇలా ఉండగా ఇక డ్రాగన్ కంట్రీ అంతు చూడటానికి భారత్ అతి పెద్ద స్కెచ్ వేసినట్లు అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. పూర్తి విషయంలోకి వెళితే అగ్రరాజ్యం పెద్దన్న అమెరికాని ఈ గొడవల్లో ఇన్వాల్వ్ చేయటానికి భారత్ వ్యూహాత్మకమైన అడుగు వేసినట్లు టాక్.
ఇప్పటికే ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక చర్చలు కూడా జరిగాయి. ఈ చర్చలకు అమెరికా భారత్ రక్షణ విదేశాంగ శాఖ మంత్రులు హైదరాబాదు హౌస్ లో 2+2 మంత్రుల స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. చైనాకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడును నిలువరించడానికి, దక్షిణాసియాలో ఇండియా స్థానాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో చర్చలు జరిగినట్లు సమాచారం.