మహమ్మారి కరోనా వైరస్ ఎఫెక్ట్ తో ఆగిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు నిర్వహించడానికి బీసీసీఐ ఏర్పాట్లు సిద్ధం చేసింది. కరోనా వైరస్ కొత్త నియమ నిబంధనలతో బీసీసీఐ ఫ్రాంచైజర్లకు అందుబాటులో ఉంచింది. ఇదిలా ఉండగా ఐపీఎల్ మ్యాచ్ లను ప్రముఖ టీవీ ఛానల్ స్టార్ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం హక్కులను సొంతం చేసుకుంది.
మ్యాచ్ జరిగే సమయంలో మధ్యలో వచ్చే యాడ్స్ విషయంలో రికార్డు స్థాయిలో ధరలను నియమించినట్లు సమాచారం. 10 సెకండ్లకు పన్నెండున్నర లక్షలు వసూలు చేయాలని స్టార్ స్పోర్ట్స్ యాజమాన్యం నిర్ణయించినట్లు టాక్. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్ కి మంచి డిమాండ్ ఉండటంతో భారీ భారీ కంపెనీలు నిర్దేశించిన సమయాన్ని స్లాట్ బుకింగ్ తరహాలో ముందే బుకింగ్ చేసుకోవడానికి ఎగపడుతున్నట్లు సమాచారం.
కరోనా వైరస్ కారణంగా చాలావరకూ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలంతా ఇళ్లలోనే ఉండటంతో..ఈసారి ఐపీఎల్ లో యాడ్స్ దక్కించుకునే కంపెనీలకు మార్కెట్ ఎక్కువగా ఉంటుందని వ్యాపార నిపుణులు చెప్పుకొస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకునే స్టార్ స్పోర్ట్స్ ఛానల్ యాజమాన్యం… విరామ సమయంలో ప్రకటనల కోసం భారీ స్థాయిలో డబ్బులు గుంజడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. గత ఏడాదితో పోలిస్తే యాడ్ ధర స్టార్ చానల్ 20 శాతం పెంచినట్లు సమాచారం. గత ఏడాది మూడు వేల కోట్ల ఆదాయాన్ని యాడ్స్ రూపంలో స్టార్ చానల్ ఆర్జించింది. ప్రస్తుతం ఉన్న ధరలు బట్టి చూస్తే ఈ ఏడాది రికార్డు స్థాయిలో యాడ్స్ రూపంలో స్టార్ సంపాదించడానికి రెడీ అయినట్లు అర్థమవుతోంది.