ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో రీతిలో బలపడాలని చూస్తున్నా బిజెపి పార్టీ ఇతర పార్టీ నేతలను ఆహ్వానించి ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బిజెపి కి ఒక ఎమ్మెల్యే గాని ఎంపీ గాని లేని నేపథ్యంలో ఇతర పార్టీ కి చెందిన నాయకులను తమ పార్టీలో చేర్చుకోవడానికి మొన్నటి దాకా అనేక ప్రయత్నాలు చేయడం జరిగింది. దీనిలో భాగంగానే కడప జిల్లాకు చెందిన ఆదినారాయణరెడ్డి అదేవిధంగా అనంతపురం జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే….. గుంటూరు టిడిపి పార్టీకి చెందిన మాజీ మంత్రి బీజేపీ లో చేరడం జరిగింది. అయితే పార్టీ నాయకులు వస్తున్నా గాని టిడిపి క్యాడర్, అనుచరులు వారితో పాటు పార్టీ లోకి రాకపోవటంతో చంద్రబాబు యొక్క నాయకత్వానికి ఏపీ బీజేపీ నేతలు భయపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
దీంతో పార్టీ కేడర్ రాకుండా నాయకులు వచ్చిన పెద్ద ప్రయోజనం ఉండదని టిడిపి పార్టీ నుండి ఎవరిని తీసుకునే ఆలోచనలో ప్రస్తుతం బిజెపి నేతలు చేయటం లేదు అనే టాక్ వస్తోంది. ఒక టిడిపిలో మాత్రమే కాక వైసీపీ పార్టీ నుండి కూడా ఇదే రీతిలో వ్యవహారం ఉంటుందని ఇతర పార్టీల నేతలను పార్టీలో చేర్చుకునే విషయం విషయంలో బిజెపి నాయకులు వెనక్కి తగ్గినట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. మొత్తం మీద ఇది వింత అనుభవం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఇప్పటివరకు కేసుల విషయంలో బీజేపీకి చంద్రబాబు తెగ భయపడుతున్నారని, మోడీ తలుపులు తెరిస్తే కాంప్రమైజ్ అవ్వాలని చూస్తున్నా…పరిస్థితిలో క్యాడర్ విషయంలో చంద్రబాబు కి బీజేపీ నాయకత్వం భయపడటం అనేది గ్రేట్ అన్ని అంటున్నారు. ఏది ఏమైనా నాయకులు వస్తున్న క్యాడర్ రాకపోవడంతో బీజేపీ నేతలు పార్టీని బలోపేతం చేయడం కోసం నానా తంటాలు పడుతున్నట్లు సమాచారం.