ఇటీవల చంద్రబాబు టిడిపి పార్టీకి సంబంధించి కొత్త కమిటీల నాయకుల పేర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టిడిపి పార్టీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు ని బాబు ప్రకటించడం జరిగింది. అయితే అచ్చెన్నాయుడు నియామకం పట్ల ఏపీ రాజకీయాలలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈఎస్ఐ స్కామ్ లో ఆయన జైలుకు వెళ్లడంతో ఆ సానుభూతి తోనే ఆ పదవి వచ్చినట్లు కొంతమంది అంటుంటే మరికొంతమంది బీసీ వర్గాలకు పెద్దపీట వేసి బీసీలను తిరిగి కాపాడుకోవడం కోసం చంద్రబాబు వేసిన ఎత్తుగడ అని వ్యాఖ్యానిస్తున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా మాత్రం అచ్చెన్నాయుడు నియామకం వెనక చంద్రబాబు అసలు ఉద్దేశం వేరే ఉంది అని సరికొత్త వార్త ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వైరల్ అవుతుంది. పూర్తి విషయంలోకి వెళితే ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్ ని ఢీ కొట్టాలంటే.. టిడిపి పార్టీ సింగిల్ గా వెళ్తే పని అయ్యే అవకాశం లేదని బాబు డిసైడ్ అయిపోయినట్లు టాక్. దీంతో ఎలాగైనా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తో చేతులు కలిపి, అప్పుడు నువ్వానేనా అన్నట్టుగా జగన్ తో పోరాటానికి దిగితే అప్పుడు.. ఏదైనా అద్భుతం జరిగే అవకాశం ఉందని ఫుల్ డిసైడ్ అయ్యాడట. అయితే అధ్యక్షుడిగా తాను గాని తన కొడుకు లోకేష్ ఉన్న…పొత్తు కోసం బీజేపీ దగ్గరికి వెళ్తే తలుపులు వేసే అవకాశం ఉండదని, దీంతో చంద్రబాబు ..తన కుటుంబానికి సంబంధించి కాకుండా బీసీ వర్గానికి చెందిన అచ్చెనాయుడికి పదవి కట్టబెట్టినట్లు ఏపీ రాజకీయాలలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
అంతేకాకుండా అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు… త్వరలోనే పార్టీ నుండి కొంతమంది ని సస్పెండ్ చేసే రీతిలో వ్యవహరించి.. బీజేపీతో పొత్తు కలిసేలా కూడా ప్లాన్ లు టిడిపిలో ఉండే బడా నేతలు అంతర్గతంగా వేస్తున్నట్లు కూడా వార్తలు ఇప్పటి నుండే వైరల్ అవుతున్నాయి. మొత్తంమీద చూసుకుంటే టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెనాయుడు ని చంద్రబాబు నియమించడం వెనకాల బీజేపీతో పొత్తు అనేది ప్రధాన ఉద్దేశం అన్నది ఇప్పుడు ఏపీలో వినపడుతున్న టాక్. కానీ బిజెపి నాయకులు మాత్రం టిడిపిని నమ్మే పరిస్థితిలో ప్రస్తుతం లేనట్లు…ఏపీలో టీడీపీ స్థానాన్ని కైవసం చేసుకునే వ్యూహాలు వేస్తున్నట్లు తెలుస్తోంది.