జగన్ సిఎం పీఠంపై కూర్చుని 17 నెలలు అవుతుంది. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి జగన్ జనాలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ… ఏ ముఖ్యమంత్రి అతి తక్కువ సమయంలో చేయని విధంగా సంక్షేమ పథకాలతో పాటు ప్రతి హామీని అమలు చేస్తూ వస్తున్నారు. అదేవిధంగా మంత్రివర్గం ఏర్పాటు చేసిన సమయంలో రెండున్నరేళ్లలో మరోసారి మంత్రివర్గం ఏర్పాటు అవటం గ్యారెంటీ అని చెప్పారు.
ఇదిలా ఉండగా మధ్యలో మండలి రద్దు అంశం రావడంతో మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లను క్యాబినెట్ నుంచి తప్పించి రాజ్యసభ పదవులు ఇవ్వడం మనకందరికీ తెలిసిందే. ఇక వారి స్థానాలలో సిదిరి అప్పల రాజు, చెల్లుబోయిన వేణు గోపాల్ లకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉండగా మరో 13 నెలల్లో మంత్రి వర్గ విస్తరణ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మంత్రుల గా వ్యవహరిస్తున్న వారి పనితీరును బట్టి ఎవరిని పక్కన పెట్టాలి ఎవరిని కంటిన్యూ చేయాలి అనే నిర్ణయం జగన్ తీసుకోబోతున్నారు.
ఇదిలా ఉండగా మంత్రివర్గ విస్తరణలో ఎవరికి అవకాశం దొరుకుతుందో తెలియదు గాని చాలా వరకు జిల్లాల వారీగా చూసుకుంటే రాష్ట్రంలో మూడు జిల్లాలకు బంపర్ ఆఫర్ మాత్రం గ్యారెంటీ అని వైసీపీ పార్టీలో అంతర్గతంగా వినబడుతున్న టాక్. క్లియర్ కార్డు మేటర్ లోకి వెళ్తే గుంటూరు, విశాఖపట్నం, అనంతపురం జిల్లాలకు చెందిన నేతలను ఎక్కువగా రెండో దఫా మంత్రివర్గ విస్తరణలో భాగంగా జగన్ తీసుకునే అవకాశం ఉన్నట్టు టాక్. కారణం చూస్తే ఈ మూడు జిల్లాలలో మినహా మిగతా జిల్లాలలో ఉన్న నేతలు ఒకరి కంటే ఎక్కువగా ప్రస్తుతం మంత్రులుగా కొనసాగుతున్నారు. దీంతో నెక్స్ట్ మంత్రివర్గ విస్తరణలో అనంతపురం, గుంటూరు, విశాఖపట్నం జిల్లాలకు చెందిన నేతలకు మంత్రులు అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.