ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ కి వాస్తు పిచ్చి ఎక్కువైంది అనే వార్తలు ఓ వర్గం మీడియా తెగ ప్రచారం చేస్తుంది. అందుకుగాను ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అన్నట్లుగా ఆ వర్గపు మీడియా కథనాలు ప్రసారం చేయటం, ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. పూర్తి విషయంలోకి వెళ్తే తాజాగా అమరావతి లోని సచివాలయంలో ఉన్న గేట్లకు అడ్డంగా గోడ నిర్మాణం చేపడుతున్నారు. చంద్రబాబు ఉన్న సమయంలోనే సచివాలయ నిర్మాణ సమయంలో నాలుగు గేట్లు ఏర్పాట్లు చేయగా అదనపుగా వాస్తు కోసం అంటూ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మరో రెండు గేట్లను నిర్మించడం జరిగింది.
కాగా జగన్ ఏడాది పాలన పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ గేట్లకు అడ్డంగా గోడ నిర్మాణానికి వైసీపీ ప్రభుత్వం పూనుకుంది. ఏపీ సచివాలయానికి ఉత్తరం దిశగా ఉన్న గేటుకు, దానికి ఎదురుగా దక్షిణదిశలో మొదటి బ్లాక్ పక్కన ఉన్న గేటుకు అడ్డంగా సీఆర్డీఏ అధికారులు తాజాగా గోడలు నిర్మిస్తున్నారు. దీంతో జగన్ పై టిడిపి నేతలు విమర్శలు చేస్తున్నారు. పరిస్థితి ఇలా ఉండగా టిడిపి చేస్తున్నా కామెంట్లకు వైసీపీ మద్దతుదారులు భారీ స్థాయిలో కౌంటర్లు వేస్తున్నారు. అసలు గేట్లకి అడ్డంగా గోడల నిర్మాణం చేపట్టడం అనేది జగన్ వాస్తు గురించి నిర్మించడం కాదని, వర్షపు నీరు వాళ్ళ అక్కడ రోడ్డు మొత్తం డామేజ్ అవుతున్న తరుణంలో జగన్ సర్కార్ ఆ నిర్ణయం తీసుకోవడం జరిగిందని సమర్ధిస్తున్నారు.
నిజంగా చంద్రబాబు కి ఉన్న వాస్తు పిచ్చి మరో నాయకుడు ఉండదని అందువల్లే రాజధాని ఏర్పాటు నుంచి సచివాలయం నిర్మాణం వరకు అన్ని అప్పట్లో చంద్రబాబు వాస్తు చూసుకుని తన పాలనకు అనుకూలంగా పరిస్థితులు ఉండేలా నిర్ణయాలు తీసుకున్నారని వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. అందువల్లే కృష్ణా నదిని ఆనుకొని రాజధాని నిర్మిస్తే ఈశాన్య దిక్కున ఉత్తరం వైపున నదీజలాలు నిత్యం పారుతాయి కాబట్టి అధికారానికి డోకా ఉండదని చంద్రబాబు జీవించినంత కాలం ఆయన అధికారంలో ఉంటారనే భావనలో సచివాలయం నిర్మించుకున్నారు, అదే రీతిలో సచివాలయం దగ్గర రెండు గేట్లు అదనంగా వాస్తు ప్రకారం కట్టించుకున్నారు…. అంటూ వైసీపీ మద్దతు దారులు గట్టిగా కౌంటర్లు వేస్తున్నారు.