రెండు తెలుగు రాష్ట్రాలలో బిజెపి కీలకంగా రాణించడానికి తెగ కష్టపడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పరిస్థితి చూస్తే గతంలో కంటే చాలా మెరుగైన పరిస్థితులు ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో జరగబోయే దుబ్బాక ఉపఎన్నికలు అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో, గ్రేటర్ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ కి బలమైన ప్రత్యర్థిగా పోటీ ఇచ్చే చాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ పరిస్థితి చూస్తే ఇటీవల కొద్దిగా స్పీడ్ తగ్గింది అనే టాక్ వినపడుతోంది.
సోము వీర్రాజు అధ్యక్షుడు అయిన తర్వాత కొద్దిరోజులు బిజెపి పేరు ఏపీలో గట్టిగానే వినబడింది. దేవాలయాల పై దాడుల విషయంలో అదే విధంగా మరికొన్ని విషయాలలో టిడిపి పార్టీ కంటే అధికార పార్టీ పై ఎక్కువగానే పోరాటాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే పార్టీలో కోవర్టులు అంటూ సోము వీర్రాజు ఒంటెద్దు పోకడలతో నిర్ణయాలు తీసుకుంటున్నారని, తాజాగా ఆయనపై పార్టీలోనే ఉన్న నేతలకు వ్యతిరేకత మొదలైంది అనే టాక్ గట్టిగా వినబడుతోంది.
సోము వీర్రాజు అధ్యక్షుడు అయిన తర్వాత పార్టీలోకి వచ్చిన వారి కంటే…. సస్పెండ్ అయిన వారి సంఖ్య ఎక్కువ అనే కామెంట్లు కూడా వస్తున్నాయి. అందువల్ల మొన్నటివరకు దేవాలయాలపై దాడులు అజెండాగా తీసుకుని ఉద్యమానికి అన్ని జిల్లాలలో హడావిడి సృష్టించిన బిజెపి… స్పీడ్ పార్టీ అంతర్గత గ్రూపు రాజకీయాల వల్ల తగ్గినట్లు వార్తలు వస్తున్నాయి. కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు అంటే చాలా వరకు పార్టీలో ఉన్న నేతలకు పడటం లేదన్న టాక్ వస్తోంది.