వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయాలలో ఒకటి…మూడు రాజధానుల నిర్ణయం. 3 రాజధానుల నిర్ణయం తీసుకోవడం తో ప్రతిపక్షాలు వైయస్ జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయగా ప్రజల నుండి మాత్రం…జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం కరెక్టే అని చాలామంది సమర్థించారు. అమరావతి అనే ప్రాంతంలో మాత్రమే అభివృద్ధి జరిగితే…మిగతా ప్రాంతాలు నష్టపోతాయని పైగా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ నష్టపోయినట్టు పరిస్థితులు భవిష్యత్తులో ఏర్పడే అవకాశం ఉందని అభివర్ణిస్తూ జగన్ మూడు రాజధానులు కాన్సెప్ట్ తెరపైకి తీసుకు రావడం తెలిసిందే.
దీంతో వచ్చిన అవకాశమే శిరోధార్యంగా భావించి ఎప్పటినుండో ప్రజలలో వ్యతిరేకత తీసుకురావాలని కాచుకుని కూర్చున్న విపక్షాలు రెడీ అయ్యాయి. అమరావతి విషయంలో టిడిపి పార్టీ అదేవిధంగా మరికొన్ని పార్టీలు దీక్షలు నిరసనలు చేస్తూ పొలిటికల్ గా జగన్ ని దెబ్బ కొట్టడానికి అన్ని విధాలా అనేక ప్రయత్నాలు చేయడం స్టార్ట్ చేశాయి. కానీ ఇప్పటికీ కూడా అమరావతి విషయంలో జగన్ ని ప్రజలలో నెగిటివ్ గా చూప లేకపోయారు అని చాలా మంది పరిశీలకులు మాట. రాజధాని రైతులు చేస్తున్న దీక్ష, టిడిపి పార్టీ అదే విధంగా మరి కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న ఆరోపణలే గాని… అమరావతి విషయంలో జగన్ ని దోషిగా చేయలేకపోయాయిని.. అంటున్నారు.
దానికి కారణం చూస్తే జగన్… అసలు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా.. తాను తీసుకున్న మూడు రాజధానులు నిర్ణయానికి కట్టుబడి ముందుకు వెళ్ళటమే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాజకీయంగా అమరావతి విషయంలో ప్రత్యర్థులను ఇరుకున పెట్టాలని జగన్ పై అనేక వేసిన జగన్ అమరావతి విషయాన్ని లైట్ తీసుకోవటమే… పొలిటికల్ గా వైసిపికి బెనిఫిట్ అయ్యిందని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ఒకవేళ నిజంగా అమరావతి విషయంలో రైతులు చేస్తున్న దీక్షలు అదేవిధంగా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్ల కి జగన్ స్పందించి ఉంటే ఏపీ రాజకీయం మొత్తం అమరావతి చుట్టూ తిరిగేది అని.. కచ్చితంగా విపక్షాలు అమరావతిని ఒక ఉద్యమంగా మార్చే అవకాశం ఉండేదని కానీ జగన్ సైలెంట్ గా తన పని తాను చేసుకోవడమే… ఈ విషయంలో రాజకీయంగా వైసిపి పొలిటికల్ మైలేజ్ సంపాదించిందనీ మేధావులు చెప్పుకొస్తున్నారు. మరోపక్క జగన్ తీసుకున్న 3 రాజధానుల నిర్ణయం రాష్ట్రంలో మిగతా ప్రాంతాలలో ఉన్న ప్రజలు కూడా సపోర్ట్ చేయటం కూడా ఒక కారణమని వ్యాఖ్యానిస్తున్నారు.