ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ జోస్యాలు అన్నీ ఫెయిల్ అయిన తరువాత కనిపించడం మానేశారు. కొత్తగా విశాఖ ఆక్టోపస్ పుట్టుకొచ్చాడు .ఆయనే మాజీ ఎంపీ సబ్బం హరి .
టీడీపీకి కంచుకోట లాంటి భీమిలి సీటు ఇచ్చినా ఓడిన సబ్బం హరి రాజకీయ జోస్యాలు చెప్పడం మొదలెట్టాడు.తాజాగా సబ్బం హరి వైసిపికి సంబంధించి చెప్పిన జోస్యం ఒకటి హాస్యాస్పదంగా ఉందంటున్నారు
రాజకీయ పరిశీలకులు.ఏ మాత్రం లాజిక్కు లేని ఈ జోస్య౦ ఏమిటంటే ఏపీలో వైసీపీ నాలుగేళ్ళ పాటు అధికారంలో ఉంటుందిట. కానీ జగన్ మాత్రం మాజీ సీఎం అవుతారట.అదే సమయంలో హరి మరో మాట అన్నారు 2022 ఓ జమిలి ఎన్నికలు వస్తాయట. అపుడు వైసీపీ ఘోరంగా ఓడిపోతుందట.
ఓ వైపు నాలుగేళ్ళు వైసీపీ అధికారంలో ఉంటుందని చెబుతూనే మరో వైపు ఏపీలో వైసీపీ పవర్ మూడేళ్ళు మాత్రమే అంటున్న సబ్బం హరి ఏం చెప్తున్నాడో ఆయనకైనా అర్థం అవుతుందా అని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.హరి కలలు కూడా సరిగ్గా కనలేకపోతున్నారని వైసీపీ నేతలు ఎగతాళి చేస్తున్నారు. మొత్తానికి జగన్ మీద అక్కసుతో ఆయన జాతకాన్నే పదే పదే చూస్తున్న విశాఖ అక్టోపస్ తన గురించి, పార్టీ గురించి కూడా ఆలోచించడం మానేశారు అని వైసీపీ నేతలు హాట్ కామెంట్స్ చేస్తున్నారు.అయినా జగన్ మాజీ ముఖ్యమంత్రి కావటం ఏంటి ?జగన్ కి పదేళ్ళ పోరాటం తరువాత దక్కింది ముఖ్యమంత్రి పదవి. అది కూడా అరకొర మెజారిటీతో కాదు, 151 సీట్లతో 50 శాతం పైగా ఓట్ల షేర్ తో. దేశమంతా తలతిప్పి చూసేలా జగన్ ఘన విజయం సాధించారు. ఏడాది పాలన పూర్తి అయింది. ఇంకా నాలుగేళ్ళ పదవీకాలం ఉంది.గత ఏడాది కాలంలోనే 90 శాతం హామీలను జగన్ నెరవేర్చారు. ఇంకా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ప్రజలలో సంత్రుప్తి శాతం బాగా ఉందని తాజాగా సర్వేలు చెబుతున్నాయి. పార్టీలో ఒకటి నుంచి పది వరకూ అన్నీ జగనే. అటువంటి ఎదురులేని జగన్ మాజీ సీఎం ఎలా అవుతారు అంటే విశాఖలో ఉన్న అక్టోపస్ కలల్లో అంటున్నారు వైసీపీ నేతలు. మరి సబ్బంహరి ఏ కోణంలో ఇది చెప్పాడో అయనకే తెలియాలి కానీ ఇప్పుడైతే ఆయనను భయంకరంగా వైసిపి వారు ట్రోల్ చేస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?