ఆగస్టు 15 దేశ స్వాతంత్ర దినోత్సవం నాడు ఐ.ఎస్.ఐ ఉగ్రవాద సంస్థ దేశంలో భారీ పేలుళ్లకు టార్గెట్ చేసినట్లు నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ముఖ్యంగా అయోధ్యని ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్లు ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరిస్తున్నాయి. ఇందుకోసం ఆఫ్గనిస్థాన్ లో ఉగ్రవాదులకు శిక్షణ కూడా ఇచ్చినట్లు నిఘా వర్గాలు చెప్పుకోస్తున్నాయి.
అంతేకాకుండా ఈ దాడులను దేశంలో అంతర్గత శక్తులు దాడి చేసినట్టు భావించేలా ప్లాన్ చేసినట్లు… దేశంలో ఈ దాడులకు పాల్పడి దేశ ప్రజల మధ్య మత గొడవలను పురికొల్పడనికి ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థ అతి కిరాతకమైన స్కెచ్ వేసినట్లు నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేయటంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. దీంతో దేశ సరిహద్దు ప్రాంతాల వద్ద ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో భద్రతా బలగాలు పహారా గట్టిగా కాస్తున్నాయి. ఏదో ఒక రీతిలో దేశంలో మతకలహాలు సృష్టించాలని పాకిస్తాన్ భావిస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. కేంద్ర రక్షణ శాఖ ఎక్కడికక్కడ భద్రతా బలగాలతో ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి రెడీ అవుతున్నాయి.