Ukraine Russia War: గత కొద్ది రోజుల నుండి ఉక్రెయిన్ రష్యా దేశాల మధ్య భారీ స్థాయిలో యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ ఆక్రమనే లక్ష్యంగా .. రష్యా బలగాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఉక్రెయిన్ రాజధాని లో ప్రభుత్వ భవనాలను లక్ష్యంగా చేసుకుని రష్యా బలగాలు చేస్తున్న దాడులలో… చాలా మంది సామాన్యులు బలైపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అంతర్జాతీయ సమాజంలో రష్యా పై భారీ ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మరోపక్క ఉక్రెయిన్ అధ్యక్షుడు జేలెన్ స్కి.. వెనకడుగు వేసేది లేదు.. రష్యాతో చివరి రక్తపు బొట్టు వరకు.. పోరాడతామని అంటున్నారు. జేలెన్ స్కి…యుదుడు. ఇటువంటి తరుణంలో.. ప్రపంచంలో యుదులు ఎక్కువగా ఉండే… దేశమైనా ఇజ్రాయేల్.. ఇప్పుడు సాటి యూదుడు జేలెన్ స్కి కోసం రంగంలోకి దిగింది.
ఉక్రెయిన్ దేశంపై… రష్యా దాడులను నిలువరించడానికి ఇజ్రాయేల్ ప్రధానమంత్రి నెఫ్టాలి బెనెట్ … రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మాట్లాడటానికి రెడీ అయ్యారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి మాస్కోలో పుతిన్ తో భేటీ కానున్నారు. ఇక ఇదే సమయంలో ఇరాన్ న్యూక్లియర్ డీల్ గురించి కూడా.. పుతిన్ తో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి మాట్లాడనున్నరు. ఏది ఏమైనా జేలెన్ స్కి కోసం ఇజ్రాయెల్ ప్రధానమంత్రి రష్యా.. అధ్యక్షుడు పుతిన్ తో భేటీ కావడం ఇంటర్నేషనల్ మీడియాలో సంచలనంగా మారింది.
అంత మాత్రమే కాక గతంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి… యుక్రేయిన్ దేశంపై పుతిన్ దాడులు చేస్తున్న సమయంలో ఫోన్ లో మంతనాలు జరిపారు. యునైటెడ్ నేషన్ లో… రష్యా దాడులకు వ్యతిరేకంగా ఓటింగ్ కూడా వేయడం జరిగింది. దీంతో ఇప్పుడు ఇజ్రాయిల్ ప్రధానమంత్రి నేరుగా పుతిన్ తో భేటీ కావడం పట్ల అందరూ ఆసక్తిగా ఏం జరుగుతుందో అని గమనిస్తున్నారు.