Israel: కరోనా వైరస్ తో పాటు ప్రపంచాన్ని టెన్షన్ పుట్టిస్తున్న వార్త ఇజ్రాయిల్-పాలస్తీనా దేశాల మధ్య చోటు చేసుకున్న యుద్ధవాతావరణం. పాలస్తీనా ప్రాంతానికి చెందిన హమాస్ ఉగ్రవాదులు గత పది రోజుల నుండి ఇజ్రాయేలు పౌరులు నివసిస్తున్న ఇళ్ల పై రాకెట్ల ప్రయోగం చేయడం తెలిసిందే. ఈ క్రమంలో కొంతమంది ఇజ్రాయెల్ దేశానికి చెందిన పౌరులు .. ఉగ్రవాదుల ప్రయోగించిన రాకెట్ లో డైరెక్టుగా ఇంటిని తాకడం వల్ల మరణించడం జరిగింది. ఈ క్రమంలో మరణించిన వారిలో కేరళ రాష్ట్రానికి చెందిన సౌమ్య సంతోష్ అనే అమ్మాయి కూడా ఇటీవల ఈ దాడిలో మరణించింది.
ఈనేపథ్యంలో ఇజ్రాయెల్ దేశం సౌమ్య సంతోష్ మరణం తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అంతమాత్రమే కాకుండా ఆమె మృతదేహాన్ని గత వారం ఇండియా కి తరలించడం తెలిసిందే. అక్కడ ఆయాగా ఉద్యోగం చేస్తున్న సౌమ్యా సంతోష్ దాడులు జరుగుతున్న సమయంలో భర్తతో ఫోన్ మాట్లాడుతూ ఉన్న టైం లోనే ఉగ్రవాదుల రాకెట్ సౌమ్య సంతోష్ నివసిస్తున్న ఇంటిని డైరెక్ట్ గా ఢీకొనటంతో.. ఫోన్ మాట్లాడుతుండగానే తమ శత్రువుల చేతిలో మరణించటంతో.. ఇజ్రాయిల్ దేశం లో.. ఉగ్రవాదుల కాల్పుల్లో సొంత దేశానికి చెందిన పౌరులు చనిపోతే వారికి ఎటువంటి హక్కులు కల్పిస్తారో..అవే హక్కులు సౌమ్య కి కల్పించి ఆమె కుటుంబానికి భరోసా ఇచ్చారు.
సౌమ్య సంతోష్ కుటుంబం బాధ్యతలను ఇజ్రాయిల్ ప్రభుత్వం భుజాన వేసుకుంది. ఆమె భర్త మరియు ఆమె కొడుకు ఇజ్రాయిల్ ప్రభుత్వం అండగా ఉంటుంది తాజాగా ఆ దేశ అధ్యక్షుడు రెవెన్ రివ్లిన్ సౌమ్య సంతోష్ కుటుంబానికి ఫోన్ చేసి పరామర్శించారు. జరిగిందానికి ఇజ్రాయిల్ దేశ అధికారులు చింతిస్తున్నట్టు తెలియజేసి.. ఆమెకు సంతాపం వ్యక్తం చేశారు.