హైదరాబాద్ను వరదలు అతలాకుతలం చేసేసిన సంగతి తెలిసిందే. భారీ వర్షం, పెద్ద ఎత్తున వరదలతో నగరం చిగురుటాకుల వణికిపోయింది. ఇలాంటి తరుణంలో వరద భాదితులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు.
హైదరాబాద్ నగరంలో వరదలకు ఇబ్బంది పడ్డ వారికి ఒక్కో కుటుంబానికి రూ. 10 వేలు సహాయం అందించాలని ఆదేశించారు. అయితే, పక్క రాష్ట్రపు ముఖ్యమంత్రి మరింత కీలక నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్ వరదల సమయంలో కేసీఆర్…
‘‘భారీ వర్షాలు, వరదల వల్ల ఇండ్లలోకి నీరొచ్చి ఆహార పదార్ధాలు, దుస్తులు అన్నీ తడిసిపోయాయి. కనీసం వండుకుని తినే పరిస్థితుల్లో కూడా చాలా కుటుంబాలు లేవు. అందుకే వారికి తక్షణ సాయంగా ప్రతీ బాధిత కుటుంబానికి 10వేల చొప్పున సాయం అందించాలని నిర్ణయించాం. ఈ కార్యక్రమం ముమ్మరంగా సాగాలి. పండుగకు ముందే డబ్బులు అందింతే పేదలకు ఉపయోగంగా ఉంటుంది. అందుకే రోజుకు కనీసం లక్ష మందికి ఆర్థిక సాయం అందించేలా పనిచేయాలి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.
బెంగళూరులో ఏం జరిగిందంటే…
బెంగళూరులో వరదలతో బాధపడుతున్న ప్రతి కుటుంబానికి 25 వేల రూపాయల పరిహారాన్ని ముఖ్యమంత్రి బిఎస్ యెడ్యురప్ప ప్రకటించారు. వర్షంలో దెబ్బతిన్న స్థలాన్ని పరిశీలించిన యడ్యూరప్ప నగరంలో కురిసిన భారీ వర్షాలతో పాటు ఇంకా రెండు రోజులు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నందున అధికారులు అలర్ట్గా ఉండాలని కోరారు. “భారీ వర్షపాతం మరియు వరదల కారణంగా నష్టపోయిన ప్రతి కుటుంబానికి రూ .25 వేలు అందించాలని నిర్ణయించారు” అని యెడ్యురప్ప మీడియా తో అన్నారు. పరిస్థితిని పరిశీలించి, ముందుకు సాగడానికి అవసరమైన చర్యలను అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. శాశ్వతం పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని నేను అధికారులను ఆదేశించాను మరియు వారు దానిపై పని చేస్తున్నారు అని ముఖ్యమంత్రి యెడ్యురప్ప చెప్పారు.