తెలంగాణ రాజకీయాలలో ముక్కుసూటిగా వ్యవహరించే నాయకుల లో ప్రముఖంగా వినపడే పేరు కాంగ్రెస్ పార్టీ కి చెందిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అయితే ఇటీవల తెలంగాణ పిసిసి అధ్యక్షుడు గురించి రకరకాల వార్తలు వస్తున్న తరుణంలో చాలామంది ఈ పదవి కోసం పోటీ పార్టీలో ఉన్న నేతలు పోటీ పడుతున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో ఉండే కీలక నాయకులతో ఎవరికి వారు తమ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. పరిస్థితి ఇలా ఉండగా టిపిసిసి అధ్యక్షుడిగా తనకు అవకాశం ఇవ్వాలని పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి అదే విధంగా మరో అగ్రనేత రాహుల్ గాంధీ ని జగ్గారెడ్డి కోరారు.
తనకి పిసిసి అధ్యక్ష పదవి ఇస్తే ఆ పార్టీలో ఉన్న సీనియర్ నాయకుల సహకారంతో… రాష్ట్రంలో పార్టీ బలోపేతం చేస్తానని స్పష్టం చేశారు. అంతేకాకుండా గ్రౌండ్ లెవెల్ నుండి క్షేత్ర స్థాయి వరకు ఉన్న అందరితో కలిసి ముందుకు వెళ్తానని, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అవసరమైతే గ్రామాల్లో కూడా పర్యటించి… పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. నా ప్రకటనలకు విషయంలో పైరవీలు పంచాయతీ లు ఉండవు…సమయం వచ్చినప్పుడు అందరికీ రిజల్ట్ తెలుస్తుంది అంటే జగ్గారెడ్డి తనదైనశైలిలో వ్యాఖ్యలు చేశారు.
పీసీసీ కోసం నేను ఢిల్లీ వెళ్లి పైరవీలు చేయలేను, మీడియా ద్వారా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేయోభిలాషులకు విజ్ఞప్తి తెలియజేస్తున్నాను. మీరే పార్టీ హైకమాండ్ కి ఈ విషయాలను పంపాలని కోరుతున్నట్లు జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. తాను చిన్ననాటి నుండే రాజకీయాల్లోకి వచ్చానని… నాపై కావాలనే కొంతమంది బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. అవసరమైతేనే వారింటికి వెళ్లి వారి అనుమానాలు నివృత్తి చేస్తాను అంటూ జగ్గారెడ్డి స్పష్టం చేశారు.