ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరికీ కీలక పరిక్ష ఎదురైంది. జగన్, కేసీఆర్ కు ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు సంబంధించి సవాల్ ఎదురైంది. దీనిని వారిద్దరూ ఎలా తీసుకుంటారు, ఎలా పరిష్కరిస్తారనేది ఆసక్తిగా మారింది. ఈనాడు తెలుగు మీడియాలో నెంబర్ వన్ అని తెలిసిందే. తెర వెనుకున్న చంద్రబాబు భజన చేస్తూనే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు కొంత అనుకూలంగానే ఉంది. అయితే.. ప్రస్తుతం మార్గదర్శిపై ఉన్న కేసు తిరిగి విచారణకు రావడంతో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పాత్ర కీలకమైంది.
సుప్రీంకోర్టులో మళ్లీ సవాలు.. సమాధానం చెప్పాల్సింది ముఖ్యమంత్రులే..
నిజానికి రూ.2600 కోట్లు డిపాజిట్ల రూపంలో రామోజీరావు మార్గదర్శి చిట్స్ ద్వారా ప్రజల నుంచి సేకరించారనేది ప్రధాన ఆరోపణ. దీంతో రామోజీరావు ఆ నగదును వెనక్కి ఇచ్చేశారు. దీంతో ఆయన తప్పు చేసినట్టు అంగీకరించినట్టైంది. కానీ.. ఆ తప్పుకు శిక్ష పడలేదు. ఒకరిదగ్గర దొంగతనం చేసి తిరిగి మళ్లీ నగదు తిరిగి ఇచ్చేస్తే దొంగతనం కాకుండా పోదు కదా. ఇదే ఇక్కడ ప్రధానంశంగా మారింది. 2018లో ఉమ్మడి హైకోర్టు ఆ కేసును కొట్టేసింది. అయితే.. ఉండవల్లి అరుణ్ కుమార్ రెండు రాష్ట్రాల సీఎంలకు అప్పట్లోనే లేఖ రాశారు. హైకోర్టు రామోజీ కేసు కోట్టేయడంపై ఇద్దరు సీఎంలు స్పందించాలని లేఖ రాశారు.
తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్..
ఇప్పటివరకూ ఈ అంశంపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు స్పందిస్తాయేమోనని వేచి చూశారు ఉండవల్లి. కానీ.. రెండేళ్లుగా ఎటువంటి స్పందన లేకపోవడంతో ఉండవల్లి స్వయంగా సుప్రీంను ఆశ్రయించారు. డిపాజిట్లు తిరిగిచ్చేసినా నేరాన్ని నేరంగానే పరిగణించాలని రామోజీరావుపై చర్యాలు తీసుకోవాలని ఈ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ అంశంలో ముఖ్యమంత్రుల పాత్ర ఉంటుందని కూడా ఉండవల్లి అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుంది.. సీఎంలు ఏం సమాధానం చెప్తారనేది కీలకంగా మారింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?