ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీకాలం జూన్ 30వ తారీఖున పూర్తయింది. కాగా ఆమెను ఇంకా ఏపీ చీఫ్ సెక్రటరీగా కొన్నాళ్లు కొనసాగించాలని జగన్ ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లెటర్ ద్వారా విజ్ఞప్తి చేసింది. కరోనా కట్టడి చర్యలు అంటూ ఆమె పదవీ కాలం ఆరు నెలలు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆ లెటర్లో కోరాటం జరిగింది. కాగా అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ సర్వీస్ నుండి రిటైర్ అయిన వారికి మళ్లీ సర్వీసులు పొడిగించాలని ముఖ్యమంత్రులు ఎవరు సిఫార్సు చేసిన అనుమతించే ప్రసక్తే లేదని చెప్పిన మోడీ సర్కార్…. నీలం సాహ్ని పదవీ కాలాన్ని మూడు నెలలు పొడిగించడం జరిగింది.
దీంతో ఏపీ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని విషయంలో లో జూన్ 30న సర్వీస్ అయిపోతున్న తరుణంలో సెప్టెంబర్ వరకూ ఆమెను పదవిలో కొనసాగించు కోవచ్చు అని కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదిలావుండగా తాజాగా మరో మూడు నెలలు ఆమెను పొడిగించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడమే కాకుండా ఆమెకు బదులుగా వేరే ఆఫీసర్ ని ఎవరైనా రిలీవ్ చేయటానికి ఓకే అని కేంద్రాన్ని జగన్ ప్రతిపాదించినట్లు టాక్. సీఎస్ నీలం సాహ్ని విషయంలో ఆమె రాష్ట్రానికి అందిస్తున్న సేవలను వదులుకోలేము అని జగన్… కేంద్రానికి సిఫార్సు చేస్తూ మరో లెటర్ రాశారు. దీంతో ఆమెకు బదులు వేరే ఆఫీసర్ ని రిలీవ్ చేసుకోవచ్చని అనే పెద్ద త్యాగనికి జగన్ రెడీ అవుతున్నట్లు సమాచారం.
మరోపక్క నీలం సాహ్ని ప్లేస్ ఖాళీ అయితే ఆ స్థానం లోకి సతీష్ చంద్ర రావడానికి ఉత్సాహం చూపుతున్నారట. ఇదిలా ఉండగా గతంలో కొంతమంది అధికారుల విషయంలో ముఖ్యమంత్రి విజ్ఞప్తులను పక్కన పెట్టిన కేంద్రం, జగన్ తాజా విజ్ఞప్తి పై ఏ రకంగా కేంద్రం రియాక్ట్ కానుందో అన్నది పెద్ద సస్పెన్స్ గా మారింది. ముఖ్యంగా నీలం సాహ్ని విషయంలో జగన్ రెండోసారి లేఖ రాయటం తో పాటు ఇక్కడ ఉన్న ఐఎఎస్ అధికారిని కేంద్రనికి ఇస్తాను అంటూ…. రిలీజ్ చేస్తాను అంటూ జగన్ చెప్పటం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో నీలం సాహ్ని టాపిక్ చర్చనీయాంశంగా మారింది.