హైదరాబాదు, జనవరి 4; అక్రమ అస్తుల కేసులో వైఎస్ జగన్మోహనరెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటీషన్పై న్యాయమూర్తి బదిలీ కావడంతో సీబీఐ కోర్టు మళ్లీ విచారణ చేపట్టనుంది. రెండేళ్లుగా వీటిపై విచారణ కొనసాగుతుండగా న్యాయమూర్తి బదిలీతో వాదనలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. సీబీఐ కోర్టులో శుక్రవారం జగన్ ఆస్తుల కేసు విచారణకు రాగా తదుపరి విచారణను ఈ నెల 25కి వాయిదా పడింది.
నేరానికి ఎలాంటి సంబంధం లేకుండా తమపై అక్రమంగా కేసులు బనాయించారని కావున ఎఫ్ఐఆర్, చార్జిషీట్ల నుండి తమకు తప్పించాలని జగన్మోహనరెడ్డి, విజయసాయిరెడ్డిలతో సహా మిగతా నిందితులు డిశ్చార్చ్ పిటీషన్లు దాఖలు చేశారు. మొత్తం 11 కేసులకు గానూ రెండేళ్లలో నాలుగు కేసుల్లో వాదనలు పూర్తి అయ్యాయి.
ఈ నేపథ్యంలో సీబీఐ కోర్టు న్యాయమూర్తి వెంకట రమణను ఆంధ్రప్రదేశ్కు కేటాయించడంతో బదిలీ అయ్యారు. కొత్తగా వచ్చే న్యాయమూర్తి డిశ్చార్చ్ పిటీషన్లపై మళ్లీ వాదనలు వినాల్సి ఉంటుందని భావిస్తున్నారు. ఒకొక్క చార్జిషీట్లలో తీర్పు వెల్లడించినట్లైయతే ఇతర కేసులపై ప్రభావం పడుతుందని భావంచి అన్ని కేసుల్లో ఒకే సారి తీర్పు ఇవ్వాలని గతంలో సీబీఐ కోర్టు నిర్ణయించింది. డిశ్చార్జ్ పిటీషన్లపై మళ్లీ వాదనలు జరగనున్నాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?