ys jagan : 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రభుత్వం, పరిపాలనలో మార్పులు తీసుకొచ్చిన సీఎం జగన్ ఇక పార్టీ ప్రక్షాళనపై కూడా దృష్టి పెట్టారు.. మంత్రివర్గం మార్పు ద్వారా ప్రభుత్వంలో మార్పులు.. జిల్లాల విభజన ద్వారా పాలనలో మార్పులు చేసినట్టే.. పార్టీ జిల్లాల ఇంచార్జిల మార్పు ద్వారా పార్టీ ప్రక్షాళన చేయాలనేది సీఎం జగన్ ఆలోచన.. ఈ మేరకు సీరియస్ గా కసరత్తు చేస్తున్నట్టుగా సమాచారం. ఇప్పటికే కొత్తగా ఏర్పాటైన 26 జిల్లాలను ఆరు విభాగాలుగా విభజించి ఆరుగురు కీలక నేతలకు ఇంచార్జి బాధ్యతలు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ జిల్లాల ఇంచార్జిల బాధ్యతలతో పాటూ పార్టీలో ఒక “సమన్వయ కమిటీ”ని కూడా ఏర్పాటు చేయాలని జగన్ భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి..! ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం మార్పులు ఇలా ఉండవచ్చని భావిస్తున్నారు..
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ys jagan : సాయిరెడ్డి పూర్తిగా పార్టీ కార్యాలయంలో.. ఆయన స్థానంలో వైవీ..!
విజయసాయిరెడ్డి ఇక పూర్తిగా పార్టీ కేంద్ర కార్యాలయంలోనే ఉండేలా జగన్ భావిస్తున్నారు. పార్టీ అన్ని అనుబంధ శాఖలకు సాయిరెడ్డి అధ్యక్షుడుగా ఉండడంతో వచ్చే రెండేళ్లు ఆయనకు ఎక్కువ పని ఉంటుంది. అందుకే ఆ బాధ్యతలు ద్వారా కార్యాలయానికి పరిమితం చేయనున్నారు. ప్రస్తుతం సాయిరెడ్డి ఇంఛార్జిగా ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాలకు కొత్త ఇంఛార్జిగా వైవీ సుబ్బారెడ్డి వెళ్లనున్నట్టు తెలుస్తుంది. వైవీ ప్రస్తుతం ఉభయ గోదావరి, చిత్తూరు జిల్లాలకు ఇంఛార్జిగా ఉన్నారు. సో.. వైవీ ఇక ఉభయ గోదావరి బాధ్యతలు నుండి తప్పుకుని, ఉత్తరాంధ్ర చూల్సి ఉంటుంది. ఇదే సయమంలో మాజీ మంత్రులు కొడాలి నాని, బాలినేని శ్రీనివాసరెడ్డి, పేర్ని నాని, కురసాల కన్నబాబు వంటి నేతలకు కూడా జిల్లాల ఇంచార్జి బాధ్యతలతో పాటూ పార్టీ సమన్వయ కమిటీ బాధ్యతలు అప్పగించనున్నట్టు సమాచారం.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కొడాలి, పెద్దిరెడ్డి కలిసి చిత్తూరు..!?
చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరుని ఈ సారి వైసీపీ క్లీన్ స్వీప్ చేయాలి అనుకుంటుంది. అందుకే చిత్తూరు జిల్లా ఇంఛార్జిగా ప్రస్తుతం ఉన్న వైవీ సుబ్బారెడ్డి స్థానంలో కొడాలి నానికి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని జగన్ భావిస్తున్నారట. పెద్దిరెడ్డి, కొడాలి నాని సమన్వయము చేసుకుని చిత్తూరు జిల్లాలో పార్టీపై ద్రుష్టి పెట్టాలని ఆలోచన.. అయితే ఇది ఎంత మేరకు అమల్లోకి తెస్తారనేది అనుమానమే. కొడాలి నాని, పేర్ని నానీల్లో ఒకరికి ఉభయ గోదావరి జిల్లాల బాధ్యతలు.., ఒకరికి గుంటూరు, ప్రకాశం జిల్లాల బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారు. అలాగే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి కూడా రెండు జిల్లాలకు ఇంఛార్జిగా నియమించనున్నట్టు సమాచారం. ఇవన్నీ ప్రస్తుతం ప్రతిపాదనల, ఆలోచనల దశలో మాత్రమే ఉన్నాయి. ఈ వారం లేదా వచ్చే వారంలోగా ఫైనల్ చేయనున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఆపై ఎమ్మెల్యేతో సమన్వయ కమిటీ..!?
జిల్లాలకు ఇంచార్జిల నియామకం అనంతరం పార్టీ “కీలక సమన్వయ కమిటీ” ఒకటి ఏర్పాటు చేసి పదిమంది నేతలను దీనిలో భాగస్వామిగా చేయనున్నట్టు తెలుస్తుంది. ఎమ్మెల్యేలతో మాట్లాడడం.. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిపై సమీక్షలు చేయడం.., పీకే టీం నివేదికల ఆధారంగా ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలకు సూచనలు చేయడం.. వారానికోసారి సీఎం జగన్ కి నివేదికలు అందించి.. పార్టీ పరిస్థితులపై సమీక్షించడం ఈ కమిటీ బాధ్యతగా చెప్తున్నారు.. ఈ కమిటీలో కూడా కొందరు మాజీ మంత్రులతో పాటూ.., సీనియర్ ఎమ్మెల్యేలను వేయనున్నారనిది ప్రస్తుతానికి ఉన్న సమాచారం..!