వైయస్ జగన్ కరోనా వైరస్ వచ్చిన తర్వాత చాలావరకు క్యాంపు కార్యాలయానికే పరిమితమయ్యారు. అక్కడి నుండే పనులను చక్కబెడుతూ వస్తున్నారు. సెక్రటేరియట్ నుంచి గత కొద్ది నెలల నుండి ఎలాంటి పనులు చేపట్టడం లేదు. అస్సలు సెక్రటేరియట్ కి రావడమే మానేశారు. ఇటువంటి తరుణంలో త్వరలో ఇక పూర్తి స్థాయిలో తన కార్యకలాపాలను సెక్రటేరియట్ నుంచి చేపట్టాలని జగన్ డిసైడ్ అయినట్లు సమాచారం. ఇప్పటివరకు క్యాంపు కార్యాలయం నుండే క్యాబినెట్ భేటీలు, స్పందన వీడియో కాన్ఫరెన్స్ ఇంకా పలు పథకాలు ఓపెనింగ్స్ నిర్వహిస్తున్నారు.
దీంతో చాలా వరకు జగన్ సచివాలయానికి రాకపోవటం, మరోవైపు కరోనా వైరస్ వల్ల సెక్రటేరియట్ బొసిపోవడం జరిగింది. ఇదిలా ఉండగా గతంలో తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఏ విధంగా సెక్రటరియేట్ నుండి విధులు నిర్వహించారో… ఇప్పుడు అదే షెడ్యూల్ ఫాలో అవ్వాలని జగన్ డిసైడ్ అయ్యారట. అంతే కాకుండా నేరుగా ప్రజలతో గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి మాదిరిగానే వినతి పత్రాలు కూడా స్వీకరించడానికి జగన్ సరికొత్త ఐడియా వేసినట్లు టాక్.
గతంలో సెక్రటరియేట్ కి వచ్చే సమయంలో సీఎంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి ముందుగా స్వీకరించి వారి బాగోగులు తెలుసుకునేవారు. ఇప్పుడు తన తండ్రి మాదిరిగానే జగన్ కూడా ఆయన షెడ్యూల్ ఫాలో అవ్వాలి అని డిసైడ్ అవ్వడం, త్వరలోనే సెక్రటరియేట్ నుండి అన్ని కార్యక్రమాలు చేపట్టబోతున్నారు, అనే వార్తలు రావడంతో వైయస్సార్ డై హార్డ్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. సంక్షేమం లోనే కాదు పరిపాలనలో కూడా జగన్ వైఎస్ఆర్ ని గుర్తు చేస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?