రాజకీయాలలో వైసిపి పార్టీ వ్యవస్థాపకుడు జగన్, టిడిపి పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీఆర్ తీరు ఇద్దరిదీ ఒకటే అన్నట్టు ఉంటది. ఇద్దరు ఢిల్లీ రాజకీయాలను మరియు యు.వి కులను ఎదిరించి సొంత పార్టీని స్థాపించి రికార్డు స్థాయిలో గెలిచినవారు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ స్థాపించి దాదాపు ఏడాది లోనే నందమూరి తారక రామారావు అధికారంలోకి రావడం జరిగింది.
చాలావరకు అప్పట్లో ఏపీలో వేరే పార్టీలు ఉండే పరిస్థితి లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ కీలకంగా వ్యవహరించేది. ప్రజలను పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో ఈ పరిస్థితులను చూసి చలించిపోయిన నందమూరి తారకరామారావు సొంతగా తెలుగుదేశం పార్టీని స్థాపించి దక్షిణాది రాజకీయాల్లోనే కీలక రాజకీయ పార్టీగా టిడిపిని తీర్చిదిద్దారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ జగన్ కూడా స్థాయిలో రాజకీయాలు చేస్తూ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సలహాలు ఇచ్చే స్థాయికి జగన్ పార్టీ వెళ్లిపోయిందని పరిశీలకుల మాట.
ఎన్టీఆర్ మరియు జగన్ ఇద్దరు కూడా ప్రజలను నమ్ముకుని రాజకీయాలు చేయడం తప్ప వేరే విధంగా రాజకీయాలు చేసిన దాఖలాలు లేవని చెప్పుకొస్తున్నారు. ప్రత్యర్థుల వ్యూహాల విషయంలో ఎన్టీఆర్ కంటే జగన్ ఎక్కువ ఇబ్బందులు మీడియా పరంగా, ఇంకా కేసులు పరంగా ఎదుర్కొన్నా గాని…. ఎక్కడ బెదరకుండా ఫుల్ ఫోకస్ మైండ్ తో రాజకీయాలు చేస్తున్నారని కొనియాడుతున్నారు. ఈ విషయంలో చంద్రబాబు ఫ్యాన్స్ కూడా ఫిదా అవ్వాల్సిందే అని మరికొంత మంది కామెంట్ చేస్తున్నారు. ఏదిఏమైనా అతి తక్కువ కాలంలో వైఎస్ జగన్ ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చి ఢిల్లీ స్థాయిలో రాజకీయాలు చేస్తున్నట్లు తాజా రాజకీయ పరిణామాలపై పరిశీలకుల మాట.