NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

విజ‌య‌సాయిరెడ్డికి జ‌గ‌న్ ద‌స‌రా గిఫ్ట్‌…ఎవ‌రికి మండిపోతోందంటే…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ఆయ‌న స‌న్నిహితుడు అనే పేరున్న పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి మ‌రోమారు మీడియా దృష్టిని ఆక‌ర్షించారు.

విజ‌య‌సాయిరెడ్డికి ఉప‌శ‌మ‌నం ఇచ్చే నిర్ణ‌యం తీసుకోవ‌డం ద్వారా ఆయ‌న‌కు సీఎం జ‌గ‌న్ ద‌స‌రా గిఫ్ట్ ఇచ్చారు. అది కూడా స్వ‌యంగా త‌న బాబాయి ద్వారా అందించారు. అయితే, దీనిపై కొంద‌రు మండిప‌డుతున్నారు.

అసలేంటి పింక్ డైమండ్ క‌థ‌?

తిరుమల శ్రీవారు పింక్‌ డైమండ్ క‌లిగి ఉన్నార‌ని, ఇది తిరుమల తిరుపతి దేవస్థానం ఆదీనంలో ఉంద‌ని గ‌తంలో ప‌లువురు పేర్కొన్నారు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో విజ‌యసాయిరెడ్డి సంచ‌ల‌న విమ‌ర్శ‌లు చేశారు. పింక్ డైమండ్ చంద్రబాబు నివాసంలో ఉందని ఓసారి, జెనీవాలో రూ.500 కోట్లకు వేలం వేశారని మరోసారి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు సైతం ఇదే కామెంట్లు చేశారు. అప్పట్లో టీటీడీ ధర్మకర్తల మండలి సిఫారసుతో ఈవో సింఘాల్‌ తిరుపతి కోర్టులో వారిద్దరిపై రూ.200 కోట్లకు పరువు నష్టం కేసు వేశారు. కోర్టు ఫీజు నిమిత్తం రూ.2కోట్ల టీటీడీ నిధులు డిపాజిట్‌ చేశారు. అయితే, ఆ కేసు నుంచి విజయసాయిరెడ్డి, రమణదీక్షితులను కాపాడేందుకే ఆ దావాను ఉప‌సంహరించుకునేందుకు సిద్ధ‌మైంది.

జ‌గ‌న్ బాబాయి ఏం చేశారంటే…

పింక్ డైమండ్ విష‌యంలో విజయసాయి రెడ్డి, రమణ దీక్షితులు పై, గతంలో వేసిన పరువు నష్టం దావా పిటీషన్ వెనక్కు తీసుకోవాలని నిర్ణయం టీటీడీ నిర్ణ‌యం తీసుకున్నట్టు పలు మీడియా సంస్థ‌లు పేర్కొంటున్నారు. పాలకమండలిలో ఇప్పటికే ఈ విషయం పై తీర్మానం కూడా చేసేశాయి. తద్వారా విజ‌య‌సాయిరెడ్డికి వైఎస్ జ‌గ‌న్ ద‌స‌రా గిఫ్ట్ ఇచ్చినట్ల‌యింది.

టీడీపీ మండిప‌డుతోంది
మ‌రోవైపు ఈ నిర్ణ‌యంపై తెలుగుదేశం పార్టీ భ‌గ్గుమంటోంది. టీడీపీ హయాంలో పింక్ డైమండ్ పోయిందంటూ రమణ దీక్షితులు, విజయసాయరెడ్డి చేసిన ఆరోపణలపై టీటీడీ రూ.200 కోట్లకు వేసిన పరువు నష్టం దావాను ఎందుకు ఉపసంహరించుకోవాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చెంగల్రాయుడు డిమాండ్ చేశారు. శ్రీవారిపై నమ్మకం ఉందని విజయసాయిరెడ్డి ప్రకటించినందున కేసును విత్ డ్రా చేసుకుంటున్నట్టు గుట్టుచప్పుడు కాకుండా టీటీడీ తీర్మానం చేయడం వెంకటేశ్వర స్వామివారిని, స్వామిని నమ్ముకున్న భక్తులను అవమానించడమే, మనోభావాలను దెబ్బతీయడమేన‌ని ఆరోపించారు. “అబ్బాయ్ సేవలో బాబాయ్ తరించే కార్యక్రమంలో భాగంగా పరువు నష్టం కేసును ఉపసంహరించుకున్నారా? పరువు నష్టం కేసులో కోర్టుకు చెల్లించిన రూ.2 కోట్లు వదులుకుంటామని చెప్పే అధికారం పాలకమండలి సభ్యులకు ఎవరిచ్చారు? అదేమైనా మీ జేబుల్లో నుంచి తీసిచ్చిన సొమ్మా?“ అంటూ విరుచుకుప‌డ్డారు.

author avatar
sridhar

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju