ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు, ఏపీ ప్రభుత్వం మధ్య పోరు కొత్త టర్న్ తీసుకుంది. నిఘా పరికరాల కొనుగోళ్లలో అవినీతికి పాల్పడ్డారన్న కారణంతో ఏపీ సర్కారు ఏబీను పదవి నుండి తప్పించిన విషయం తెల్సిందే.
ఈ సస్పెన్షన్ ను సవాల్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేయగా, హైకోర్టు ఏబీకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఏపీ సర్కారు విధించిన సస్పెన్షన్ చెల్లదని కొట్టివేసి వెంటనే ఆయన పదవి ఆయనకు అప్పగించాలని, సస్పెన్షన్ కాలంలో జీతభత్యాలు చెల్లించాలని పేర్కొంది. అయితే ఈ వ్యవహారంపై ఏపీ సర్కారు సుప్రీమ్ కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరింది. జులై 6 తర్వాత విచారణ జరగనుంది. ఏబీ సుప్రీమ్ లో కేవియట్ దాఖలు చేసారు.