Ys Jagan: దేశంలో కరోనా డేంజర్ బెల్స్ భయంకరంగా మోగుతున్నాయి. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో .. కరోనా రోగులకు బెడ్లు కూడా దొరకని పరిస్థితి. మరోపక్క ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో చాలా రాష్ట్రాలలో ప్రైవేట్ హాస్పిటల్స్ కరోనా రోగుల వద్ద భారీగా సొమ్ము చేసుకుంటున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఆ పరిస్థితి రానివ్వకుండా, ఏపీ ప్రజలను ప్రైవేట్ ఆస్పత్రిలో దోచుకో నివ్వకుండా జగన్ ప్రభుత్వం ఎక్కడికక్కడ.. జాగ్రత్తలు తీసుకుంటూ.. ట్రీట్మెంట్ ధరలను నియమించడం జరిగింది. కరోనా రోగుల వద్ద అధికంగా సొమ్ము చేసుకుంటే.. సదర్ హాస్పిటల్ పై చర్యలు తీసుకునేలా వైద్య యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఇదే క్రమంలో ప్రజల ఆరోగ్యం పట్ల.. శ్రద్ధ వహిస్తూ.. కరోనా నీ.. ఆరోగ్యశ్రీ లోకి చేర్చడం జరిగింది.
సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా.. దాదాపు లక్ష మంది రోగులు .. కరోనా వైద్యం ఫ్రీగా చేయించుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా జాతీయ మీడియా చానల్స్ ప్రసారం చేస్తున్నాయి. దాదాపు లక్షకుపైగా కరోనా రోగులకు ఇప్పటివరకు జగన్ ప్రభుత్వం 309 కోట్లు ఖర్చు చేసినట్లు చానల్స్ కథనాలు ప్రసారం చేస్తూ ఉన్నాయి. మరోపక్క ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉండటంతో.. రాష్ట్రంలో కరోనా రోగులకు భోజన, బెడ్లు, ఆక్సిజన్ కొరత లేకుండా వైద్య సదుపాయం ఎవరికీ తక్కువ కాకుండా వైద్య శాఖకు జగన్ కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
అంతే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజలను కాపాడటంలో కూడా జగన్ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హైలెట్ అవుతున్నాయి. రాష్ట్రంలో ఆక్సిజన్ సామర్థ్యం ఎక్కువగా ఉండే విధంగా.. ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడంతో.. ఇప్పుడు ఏపీ నుండి ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్ పంపిణీ సరఫరా అవుతోంది. కేంద్రం గతంలోనే ఆక్సిజన్ నిల్వలు ఉంచుకునేలా దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ మిగతా రాష్ట్రాల కంటే జగన్ ఏపీలో.. ఆక్సిజన్ కొరత లేకుండా ప్లాంట్లు ఏర్పాటు చేయటం మాత్రమే కాక కరోనా కిట్లు కూడా భారీగా స్టాక్ ఉండే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దీంతో దేశవ్యాప్తంగా ఏపీ యే ఇతర రాష్ట్ర ప్రజల ప్రాణాలను కాపాడటం లో కీలక పాత్ర పోషిస్తోంది. మరో పక్క రాష్ట్రంలో వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం కూడా శరవేగంగా జరిగేలా చర్యలు చేపడుతోంది.