ఏపీ లో పాలసీ పరంగా అభివృద్ధి శూన్యం అని ఇటీవల నీతి అయోగ్ తేల్చిచెప్పింది. కాగా కనీస పోర్టులు లేని తెలంగాణ రాష్ట్రం ఆరవ స్థానంలో ఉంటే, 12 పోర్టులు కలిగి ఉన్న ఆంధ్ర ప్రదేశ్ 20వ స్థానంలో ఉందని ఏపీ సర్కార్ పై మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ద్వజమెత్తారు. అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో పెట్టిన పరిశ్రమలను రాష్ట్రం నుండి వెళ్ళి పోయేలా వ్యవహరించారని, ఇక్కడ ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే భయపడే రీతిలో ప్రభుత్వం పరిపాలన చేస్తున్నటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల నీతి అయోగ్ రిలీజ్ చేసిన ఎగుమతుల సన్నద్దతలో ఏపీ 20వ స్థానంలో ఉండటం దారుణమని, ఎనిమిది తీరప్రాంత రాష్ట్రాలలో, ఏపీ ఏడవ స్థానంలో ఉండటం బట్టి వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని స్పష్టంగా అర్థం అవుతుంది అంటూ యనమల విమర్శించారు. ఇదే విషయాన్ని నీతి అయోగ్ చెప్పిందని తీరప్రాంత రాష్ట్రమైన పాలసీ పరంగా ఆంధ్రప్రదేశ్ పనితీరు నాసిరకంగా ఉంది అన్నట్లు నీతి అయోగ్ చెప్పినట్లు యనమల చెప్పుకొచ్చారు.
కక్షపూరితంగా పరిపాలన చేయడం వల్లే పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి భయపడుతున్నారని తూర్పు రాబట్టారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అప్పులు చేయడానికి ఉన్న అన్ని అవకాశాలు వాడేసిన పరిస్థితి ఏర్పడిందని ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. పైగా కరోనా కష్టకాలంలో ఆదాయం ఏమీ రాకపోవటంతో…. కేంద్రానికి కూడా ఆదుకునే పరిస్థితి లేకపోవడంతో రాబోయే రోజుల్లో జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో చాలా కోత విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇప్పటికే పెట్రోల్ పై అదనపు చార్జీలను పెంచిన ప్రభుత్వం రాబోయే రోజుల్లో….. ఆదాయం సమకూర్చుకోవడానికి మరో పెద్ద పన్ను ఏదైనా వెయ్యొచ్చు అని భావిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇలా ఉంటే డబ్బులు పంచుకుంటూ పోతే ఇక ప్రభుత్వ కార్యక్రమాలు చేసేది ఏమీ ఉండదని వ్యాఖ్యానిస్తున్నారు.ఇచ్చిన హామీలు కొండంత ఉంటే రాబడి గోరంత ఉన్న తరుణంలో…. ప్రజలనుండి వ్యతిరేకత పిడుగు లాగా మారకముందే …జగన్ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే బాగుంటుంది అని లేకపోతే పూర్తిగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.