ఫస్ట్ నుండి వైసిపి పార్టీ అధ్యక్షుడు ఏపీ సీఎం జగన్ దూకుడు రాజకీయాలు చేస్తరని అందరికీ తెలిసిందే. తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీని ఎదిరించి బయటకు వచ్చి సొంతపార్టీ పెట్టిన నాటి నుండి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ టైం లో కేసులు పెట్టినా గాని వాటిని న్యాయస్థానంలోనే ఎదుర్కొని… స్థాపించిన వైసిపి పార్టీ ని ముందుకు నడిపించారు. రాజకీయంగా అనేక కష్టాలు ఎదుర్కొని చాలా వరకు రాటు తేలేరు. ఏలాంటి కేసులు పెట్టిన వాటిని ఎదుర్కుంటు ముందుకే నడిచాడు తప్ప వెనక్కి తిరగలేదు జగన్.
ప్రత్యర్థులు కాంగ్రెస్ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా వాళ్లు ఎలాంటి ఇబ్బందులు పెట్టిన అప్పట్లో ధైర్యంగా ఎదుర్కొని జైల్లో ఉండే బయట తన తల్లి చెల్లి తో రాజకీయం చేసి పార్టీని ఉప ఎన్నికల్లో విజయ స్థానంలో పార్టీని తీసుకెళ్లారు. కాగా విభజన జరిగిన తర్వాత మిగిలి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి, బిజెపి, జనసేన కూటమి పై దాదాపు గెలిచే పరిస్థితికి వచ్చి 5% ఓటింగ్ తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో అధికారంలో వచ్చిన చంద్రబాబు అనేక ఇబ్బందులకు గురి చేసినా గాని జగన్ ప్రతిపక్ష నేతగా పోరాడుతూ ఎక్కడ వెనకడుగు వేయలేదు. ప్రతిపక్షంలో ఉన్నా తన ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు చంద్రబాబు కొన్న గానీ .. అన్ని పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొన్న జగన్ తన పాదయాత్రతో మొత్తం ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసి 2019 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవడం తెలిసిందే.
అయితే జగన్ అధికారంలోకి వచ్చినా తీసుకుంటున్న నిర్ణయాలు చాలావరకు న్యాయస్థానాలలో బోల్తా పడుతూ ఉన్నాయి. అయితే న్యాయస్థానాల తీర్పు వెనకాల చంద్రబాబు హస్తం ఉన్నట్లు… ఏపీ హైకోర్టు తీర్పుల విషయంలో ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఏపీ సీఎం జగన్ లెటర్ రాయడం దేశ రాజకీయాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. జాతీయ మీడియా చానల్స్ జగన్ రాసిన లెటర్ పై డిబేట్ ల మీద డిబేట్ లు పెడుతూ ఉన్నాయి. అంతే కాకుండా దేశంలోని డేరింగ్ అండ్ డాషింగ్ ముఖ్యమంత్రిగా ఈ తరుణంలో ఆయన చానల్స్ జగన్ దూకుడు ను అభివర్ణిస్తున్నాయి.