ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రస్థాయిలో ఉందన్న సంగతి తెలిసిందే. రోజుకి పది వేల పాజిటివ్ కొత్త కేసులు బయటపడటంతో చాలావరకు ప్రజలలో కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. పరిస్థితి ఇలా ఉండగా విపక్షాల నుండి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న తరుణంలో కరోనా నిర్ధారణ పరీక్షలు ఎక్కువ జరుగుతున్నందువల్ల కొత్త కేసులు బయట పడుతున్నట్లు అధికార పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే కరోనా మహమ్మారి వల్ల రాష్ట్రంలో మూడు వేలకు పైగా మరణాలు సంభవించడం జరిగింది.
రికవరీ రేటు కూడా పెద్దగా లేకపోవడంతో ప్రభుత్వం కూడా పెద్దగా స్పందించిన తీరు గతంలో మాదిరిగా లేకపోవటంతో టిడిపి పార్టీ ఓ వీడియోని రిలీజ్ చేసి వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజల ప్రాణాలు తీస్తున్నాడు అంటూ అతిపెద్ద ఆరోపణ చేసింది. పూర్తి విషయంలోకి వెళితే ఇటీవల టిడిపి పార్టీకి చెందిన సోషల్ మీడియాలో ప్రాణాలు కాపాడే వినాయక పూజకు పర్మిషన్ నై, ప్రాణాలు తీసే వైన్ షాపులకు పర్మిషన్ హై అంటూ ఎటకారం ఐన కామెంట్స్ పెట్టి ఓ వీడియోను పోస్ట్ చేసింది.
అంతేగాక తమకు ఆదాయమే ముఖ్యమని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైసీపీ ప్రభుత్వం అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు చాలామంది వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. వైఎస్ జగన్ కి నిజంగా మద్యపానం నిషేధించాలని ఉంటే….. ఇలాంటి కరోనా లాంటి క్లిష్ట సమయంలో మద్యం షాపులు క్లోజ్ చెయ్యాలి కదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
ప్రాణాలు కాపాడే వినాయక పూజకు పర్మిషన్ నై నై…! ప్రాణాలు తీసే వైన్ షాపులకు పర్మిషన్ హై హై…! తమకు ఆదాయమే ముఖ్యమని ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వైసీపీ ప్రభుత్వం. pic.twitter.com/cK08ZdPiz8
— Telugu Desam Party (TDP Official) (@JaiTDP) August 24, 2020