ఏపీ ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబుని మరియు ఆయన కుమారుడు నారా లోకేష్ ని సోషల్ మీడియాలో ఎప్పుడూ టార్గెట్ చేసి విమర్శలు చేస్తూ ఉండే వారిలో ముందుంటారు విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి ఇప్పటివరకు సోషల్ మీడియాలో స్పందించిన అంశాలలో దాదాపు 80 శాతం బాబు లోకేష్ గురించి సంబంధించిన వార్తలు ఉంటాయని చాలా మంది చెప్పుకొస్తారు. కాస్త వెటకారంగా వ్యంగ్యంగా చంద్రబాబు ని ఆయన కుమారుడు నారా లోకేష్ ని విమర్శించాలంటే విజయసాయిరెడ్డి చాలా కరెక్ట్ అని వైసిపి లో ఉన్న సీనియర్ నాయకులు క్యాడర్ కూడా చెప్పుకోస్తుంటుంది.
నడుస్తున్న ట్రెండ్ ప్రకారం సెటైర్లు విమర్శలు చేస్తూ తండ్రి కొడుకులను చెడుగుడు ఆడుకోవడం లో విజయసాయి రెడ్డి తీరే వేరు అని చాలామంది అంటారు. కరోనా వైరస్ కారణంగా చంద్రబాబు నారా లోకేష్ హైదరాబాద్ కే పరిమితమయి ఉన్న తరుణంలో వారిద్దరిపై వ్యంగ్యంగా విమర్శలు చేశారు. పెద్దరాయుడు తండ్రి కొడుకులు తప్పిపోయారు అని వారిని బలవంతంగా వ్యాన్ ఎక్కించి మా రాష్ట్రానికి పంపించండి అంటూ ఎటకారంగా విజయసాయిరెడ్డి కామెంట్ చేయటం ఆ ఘనత ఆయనకే చెల్లింది.
ఈ రకంగా చాలా సందర్భాలలో ఇటీవల విజయసాయి రెడ్డి తండ్రి కొడుకులను చాలా గట్టిగా టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో సెటైర్లు బాగా వేస్తున్న తరుణంలో జగన్…ఇటీవల ఓ సందర్భంలో పాపం అన్నా వాళ్ళిద్దరినీ వదిలేయ్ అని జాలి చూపించినట్లు పార్టీలో టాక్. అయినా కానీ విజయసాయిరెడ్డి మాత్రం ఎక్కడా తగ్గడం లేదని వైసీపీ నేతలు అనుకుంటున్నారట. మరోపక్క విజయసాయిరెడ్డి చంద్రబాబు, లోకేష్ పై వేసే డైలాగులు ఏపీ మీడియా సర్కిల్ లో కూడా వైరల్ అవుతూ ఉంటాయి. తండ్రి కొడుకులని మాత్రమే కాక టిడిపికి అనుకూలంగా ఉండే మీడియా ప్రతినిధులకు కూడా విజయసాయి రెడ్డి తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ పంచ్ డైలాగులు ఓ రేంజ్ లో పేల్చుతారు.