వైయస్ జగన్ తన క్యాబినెట్ లో ఉన్న మంత్రులకు పదవీకాలం రెండున్నర ఏళ్ళు మాత్రమే నిర్ణయించటం తో చాలా మంది మంత్రులు సగం కాలం పూర్తవడంతో చేతివాటం ప్రదర్శిస్తున్నాట్లు జగన్ కి ఫిర్యాదులు అందినట్లు సమాచారం. దీంతో వైయస్ జగన్ క్యాబినెట్ మంత్రుల పనితీరు ఎలా ఉంది? ప్రజలతో ఎలా మెలుగుతున్నారు? ఇలా అనేక రీతులుగా ఎవరికీ తెలియకుండా పీకే కన్సల్టింగ్ వాలింటర్ సిస్టం అనే సంస్థతో సర్వే చేయించినట్లు సమాచారం.
ఈ సర్వేలో కొంతమంది మంత్రులు ప్రభుత్వ కార్యాలయాల్లో…. అధిపత్యం ప్రదర్శిస్తూ అవినీతికి పాల్పడినట్లు, బంధుప్రీతి చూపించినట్లు తేలింది. అంతేకాకుండా నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యేలతో కూడా మంత్రులు సరైన రీతిలో వ్యవహరించ లేనట్లు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సర్వే చేసి వచ్చిన నివేదికలో జగన్ కాబినెట్ లో ప్రముఖ మంత్రుల పేర్లు ఆ నివేదికలో ఉన్నట్లు టాక్. ప్రస్తుతం ఆ నివేదిక జగన్ టేబుల్ మీద ఉన్నట్లు పార్టీలో వార్తలు వినబడుతున్నాయి.
దీంతో మిగతా మంత్రులలో వాళ్ళ పేర్లు కూడా ఆ నివేదికలో ఉన్నాయేమో అని తెగ వణుకుతున్నారు. జగన్ తన క్యాబినెట్ ఏర్పాటు చేసిన సమయంలో రెండున్నరేళ్ల పాటు మంత్రి పదవుల్లో ఉంటారని, ఆ తర్వాత 90 శాతం మంది పదవులు కోల్పోతారని స్పష్టం చేయడం జరిగింది. కాగా ఇప్పటికే 14 నెలలు కావటంతో ఉన్న కొద్ది సమయంలో నాలుగు రాళ్ళూ వెనకేసుకుందామని చాలా వరకు మంత్రులు అవినీతికి పాల్పడుతున్నట్లు తాజా సర్వేలో తేలినట్లు సమాచారం. దీంతో నివేదిక లో ఉన్న మంత్రులపై జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.