వెనకబడిన జిల్లాల్లో ఒకటైన ప్రకాశం జిల్లా పై జగన్ ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది.అన్ని రంగాల్లో ప్రకాశం జిల్లాను పురోగమింప చేసేందుకు కొత్త కొత్త ప్రాజెక్టులను మంజూరు చేయబోతోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు.
కనిగిరి,దర్శి లలో రెండు వేల మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పనున్నట్లు ఆయన వెల్లడించారు.మార్కాపురంలో వైద్య కళాశాలను ఏర్పాటు చేసే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు.రామాయపట్నం పోర్టు కూడా అతి త్వరలో ఆకారం దాల్చనున్న దని ఆయన వెల్లడించారు. జిల్లాలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు సర్వే జరుగుతోందన్నారు.ఈ ప్రాజెక్టులన్నీ గనుక వచ్చినట్లయితే ప్రకాశం జిల్లా వెలిగిపోవటం ఖాయం.ప్రకాశం జిల్లాలో వైసీపీకి మొదటి నుంచి పట్టు ఉంది.2014 లొి జిల్లాలోని పన్నెండు అసెంబ్లీ సీట్లకు గాను ఆరు,2019లో ఎనిమిది వైసిపికి లభించాయి. పైగా ముఖ్యమంత్రి జగన్కు సమీప బంధువులైన వైవి సుబ్బారెడ్డి టిటిడి చేరువని గాను బాలాని శ్రీనివాస్రెడ్డి రాష్ట్ర మంత్రిగానూ ఉండడంతో సీఎం ప్రకాశం జిల్లాకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నారు.అదే సమయంలో టిడిపికి ప్రకాశం జిల్లాలో నాలుగు సీట్లు లభించిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రానున్న స్థానిక సంస్థల ఎన్నిక ఎన్నికల నాటికి జిల్లాలో టిడిపిని పూర్తిగా నిర్వీర్యం చేసే పథక రచన కూడా జరుగుతోంది.ఏదేమైనా చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురైన ప్రకాశం జిల్లాకు జగన్ హయాంలో మంచి రోజులు వచినట్లు కనిపిస్తోంది.