బీజేపీతో అనధికార స్నేహం విషయంలో..కేంద్ర ప్రభుత్వంతో అనధికార ఒప్పందాలు విషయం లోనూ.. ప్రత్యేక హోదా విషయంలోనూ.. అమరావతి రాజధాని విషయంలోనూ.. బిజెపిపై విమర్శల విషయంలోనూ..వైసీపీ అధినేత సీఎం జగన్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రత్యేక హోదాను గట్టిగా అడిగింది లేదు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పిన జగన్ ఎన్నికల తర్వాత 22 మంది ఎంపీ లు గెలిచినా సరే దాని గురించి ఏమాత్రం మాట్లాడలేదు. బీజేపీతో బంధం విషయంలో జగన్ చాలా ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నారు. కానీ విజయసాయిరెడ్డి మాత్రం బిజెపిని, బిజెపి నాయకులను ట్విట్టర్ ద్వారానో డైరెక్ట్ గానో గిల్లుతూ, గిచ్చుతూ కెలుకుతుండటం వల్ల వైసిపి కి లాభమా? నష్టమా?, జగన్ వేస్తున్న సాఫ్ట్ కార్నర్ ప్లాన్ ను విజయసాయి రెడ్డి గండి కొడుతున్నట్లా లేదా, దీనిపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందా? విజయసాయిరెడ్డే సొంతంగా తన లోపాయికారిని చూపిస్తున్నారా? అసలు ఈ విషయంలో ఏం జరుగుతోంది.
వ్యూహానికా..? టైం పాస్ కా..? అసలు విజయసాయి పన్నాగం ఏమిటి?
వైసీపీకి ప్రధాన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే సంస్థాగతంగా వైసిపికి ఉన్న కార్యకర్తల బలమే తెలుగు దేశం పార్టీకి ఉంది. పేరున్న నాయకుల విషయంలోనూ కార్యకర్తల బలం, బాలగంలోనూ ఏదైనా రాష్ట్రంలో ప్రధాన ప్రత్యర్ధులు వైసిపి, టిడిపి. అక్కడ వరకు బాగానే ఉంది. కానీ విజయసాయిరెడ్డి టిడిపిపై విమర్శలు చేస్తూ చేస్తూ మధ్యలో బిజెపిని కూడా లాగే ప్రయత్నం చేస్తుంటారు. గతంలో కన్నా లక్ష్మీనారాయణ టిడిపి చంద్రబాబు దగ్గర 20 కోట్లు తీసుకుని వైసీపీపై విమర్శలు చేస్తున్నారని ఒక పెద్ద బాంబు పేల్చారు. తాజాగా టిడిపి మిడతల దండు బీజేపీలో చేరి రంగులు మార్చేస్తుందంటూ ట్విట్టర్ లో ఓ వ్యాఖ్య చేశారు. నాడు 20 కోట్ల ఆరోపణకు కన్నా నుండి ధీటుగానే సమాధానం వచ్చింది. ఏకంగా కోర్టు మెట్లు ఎక్కారు. కానీ బిజెపి పెద్దలు జోక్యం చేసుకుని దాన్ని అక్కడితో ఆపారు. తాజాగా చేసిన వ్యాఖ్యపై కన్నా లక్ష్మీనారాయణతో పాటు బీజేపీ లోని కీలక నాయకులు సునీల్ ధియోధర్, ఎమ్మెల్సీ మాధవ్ కూడా స్పందించి విజయసాయిరెడ్డికి చురకలంటించారు. ఇలా బిజెపితో కయ్యం పెట్టుకోవడం ద్వారా విజయసాయికి వస్తున్నా లాభం ఏమిటి అనేది వైసీపీ శ్రేణుల్లో చర్చించుకుంటున్నాయి. కేంద్ర తో కయ్యం పెట్టుకుంటే రాష్ట్రానికి నష్టమే. బీజేపీతో కయ్యం పెట్టుకుంటే వైసీపీకి నష్టమే. దేశంలో ఒక ప్రగాఢ శక్తిగా బిజెపి అవతరించింది. బిజెపికి లొంగని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రధానమైనది. ఈ సమయంలో అడిగినవి తెచ్చుకుని సాఫ్ట్ గా జాగ్రత్తగా డీల్ చేయాల్సిన పార్టీతో ఇటువంటి కయ్యం పెట్టుకోవడం విజయసాయికి అవసరమా అంటూ వైసీపీ నాయకులే అంతర్గతంగా చర్చించుకుంటున్నారుట.
రఘురామ కృష్ణంరాజు వ్యవహారంలో ఏమి జరుగుతోంది?
రఘురామ కృష్ణంరాజు వెనుక బీజేపీ ఉంది అనేది విజయసాయిరెడ్డి, జగన్మోహన రెడ్డి నవ్వుతున్నారే అనుకుందాం. అలాంటప్పుడు నేరుగా సీఎం జగన్ మోహన్ రెడ్డే.. అమిత్ షా, ప్రధాని మోదీతో సమావేశమై ఇటువంటి విషయాన్ని చర్చించి రఘురామకృష్ణంరాజు వ్యవహారాన్ని ఎంత సీరియస్ గా తీసుకున్నామో అతనిపై అనర్హత వేటు పడేలా చేయవచ్చు. లేదా స్పీకర్ ఓం బిల్లా కు సీఎం జగన్మోహన్ రెడ్డి నుండి పార్టీ అధినేత గా లేఖ రాసే ప్రయత్నం చేయవచ్చు. లేదా విజయసాయి రెడ్డి ఢిల్లీ వెళ్లి లాబీయింగ్ లూ చేయవచ్చు. బీజేపీతో వైసీపీకి ఉన్న అంతర్గత బంధాల నేపథ్యంలో ఇవన్నీ మార్గాలే. కానీ నేరుగా, ట్విట్టర్ ద్వారా,
మీడియా ద్వారానో ఆరోపణలు, విమర్శలు చేసుకోవడం ద్వారా బిజెపి కి దూరం అవ్వడం తప్పితే వైసిపి గాని విజయసాయి గాని వచ్చే ప్రయోజనం ఏమి ఉండదు. ఈ సమయంలో బిజెపి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రఘురామకృష్ణంరాజు కు అండగా నిలిస్తే వైసిపి మరింత ఇరుకున పడుతుంది. రఘురామకృష్ణంరాజు ప్రస్తుతం వైసీపీ పట్ల తెగింపుగా వ్యవహరిస్తున్నారు. తన పార్లమెంటు సభ్యత్వం రద్దు కాదు అని తెలిసిన మరుక్షణం ఆయన మరింత రెచ్చి పోవడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన రెడ్డి ఆర్ధిక వ్యవహారాలు, విజయసాయి రెడ్డి నడిపిన ఆర్ధిక వ్యవహారాలు కూడా రఘురామకృష్ణంరాజు బయటపెట్టడానికి కొన్ని సిద్ధం చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో రఘురామ కృష్ణంరాజు వ్యవహారంలో, బిజెపి వ్యవహారంలోనూ వైసిపి వ్యూహాత్మకంగా లేకపోతే మాత్రం దెబ్బతినడం ఖాయం అని వైసీపీలోనే ఓ వర్గం భావిస్తోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?