హైదరాబాద్, జనవరి 16: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్తో తెలంగాణా రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారకరామారావు బుధవారం భేటీ అయ్యారు. హైదరాబాద్లోని వైసిపి అధినేత నివాసం లోటస్పాండ్లో కేటిఆర్తో పాటుగా ఆ పార్టీ నేతలు వినోద్, సంతోష్, పల్లా రాజేశ్వర్రెడ్డి, శ్రావణ్కుమార్ రెడ్డిలతో కలసి చర్చలు ప్రారంభించారు.
ఈ భేటీలో ఫెడరల్ ఫ్రంట్పై కేటిఆర్ బృందం ప్రధానంగా చర్చించనుంది ఎపికి సంబంధించిన ప్రత్యేక హోదా అంశాన్ని జగన్ వారితో ప్రస్తావించనున్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ నేతలతోపాటు వైసీపి నేతలు ఎంపి విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, మిథున్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
previous post
next post