Corona : దేశంలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్ర, కేరళ అదే విధంగా మధ్య ప్రదేశ్ ఇంకా పలు రాష్ట్రాలలో వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కర్ఫ్యూలు అదేవిధంగా లాక్ డౌన్ ను నిర్వహిస్తున్నారు. మరో పక్క ప్రధాని మోడీ కూడా దేశంలో సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని .. కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఇటీవల అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమైన సమయంలో తెలిపారు.
ప్రజలను భయబ్రాంతులకు గురి చేయకుండా కరోనా నిబంధనలు అమలు చేయాలని స్పష్టం చేశారు. ఇలాంటి తరుణంలో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో కూడా కేసులు పెరుగుతూ ఉండటంతోపాటు ఎండలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో జగన్ ప్రభుత్వం కరోనా, ఎండలు ఎఫెక్ట్ కి స్కూల్స్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. మేటర్ లోకి వెళ్తే ఉదయం 7 గంటల 45 నిమిషాల నుండి మధ్యాహ్నం 12:30 వరకు మాత్రమే స్కూల్స్ ఓపెన్ చేయాలని ఏపీ ప్రభుత్వం డిసైడ్ అయింది. ఈ మేరకు ప్రభుత్వ విద్యా శాఖ అధికారులు అన్ని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.