Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ఇవ్వని హామీలను కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న జగన్ సర్కార్ కి ప్రజలు తాజాగా జరిగిన స్థానిక ఎన్నికలలో నీరాజనాలు పట్టారు. తిరుగులేని పార్టీగా వైసిపి దూసుకు పోతూ ఉండగా .. ఎదురులేని రాజకీయ నేతగా జగన్ దూకుడు ఆలోచనలు చేస్తూ ఉన్నారు.
ప్రతి విషయంలో ప్రజలకు మేలు చేసే రీతిలో ఆలోచన చేస్తున్న జగన్ సర్కార్ తాజాగా వైయస్సార్ జయంతి నాడు రాష్ట్రంలో సరికొత్త కార్యక్రమం ప్రారంభించడానికి రెడీ అయింది. మేటర్ లోకి వెళ్తే జూలై 8 వ తారీకు నుంచి జగనన్న స్వచ్ఛ సంకల్పం అనే కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల పరిశుభ్రత లక్ష్యంగా..వంద రోజుల పాటు జరపాలని ఇంటినుండి చెత్తను సేకరించి, గ్రామాల్లో రోడ్లను పరిశుభ్రంగా ఉంచడానికి జగన్ సర్కార్ ఆలోచన చేసింది. దీంతో జూలై 8 వ తారీకు వైయస్ఆర్ జయంతి నాడు ఏపీలో అన్ని గ్రామాల్లో ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఈ పరిశుభ్రత కార్యక్రమాలు జరగనున్నాయి.