ఏపీ సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా హైలెట్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. కేవలం ఏడాది పరిపాలన లోనే దేశంలో కీలక రాజకీయ నేతగా రాణిస్తున్న వైయస్ జగన్ కరోనా కట్టడి చేయడంలో చాలా వరకు సక్సెస్ అయినట్లు పేరు సంపాదించడం జరిగింది. ఇదిలా ఉండగా మొదటి నుండి వ్యవసాయ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత నిచ్చే వైయస్ జగన్, తాజాగా ఏపీలో రైతుల కోసం సైంటిస్టుల సేవలు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా సరికొత్త నిర్ణయం తీసుకున్నారు.
పూర్తి విషయంలోకి వెళితే ఏపీలో పంట సాగులో కష్ట నష్టాలపై సలహాలకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. 155251 ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా అగ్రికల్చర్ కి గాని హార్టికల్చర్ కి గాని పశువులకు సంబంధించి గాని ఫిషరీస్ కి గాని ఎవరికీ ఎటువంటి డౌటు ఉన్న, దానికి సంబంధించిన రైతు ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేయవచ్చని 20 మంది సైంటిస్టులు ఆధ్వర్యంలో ఈ కాల్ సెంటర్ ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. సైంటిస్టులు…రైతులకు సలహాలు సూచనలు ఇస్తారని చెప్పుకొచ్చారు. రైతులు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొన్న దానికి సంబంధించి పరిష్కారాలు పరిష్కరించడం కోసమే ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్లు జగన్ తెలిపారు.