ఏపీలో అధికార పార్టీ నాయకుల అనుచరులు తెగ రెచ్చిపోతున్నారు. అధికారంలో తమ నాయకుడు ఉండటంతో రాష్ట్రంలో ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. పూర్తి విషయంలోకి వెళితే వైసిపి పార్టీ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అనుచరుడిగా పేరొందినా సలివేంద్ర సురేష్ ఏపీ రాజధాని ప్రాంతం గుంటూరు దగ్గర పెదకాకానిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం అని అపార్ట్మెంట్ నూ అద్దెకు తీసుకోవటం జరిగింది. ఆ తర్వాత ఆ అపార్ట్మెంట్ లో పేకాట క్లబ్ పెట్టి గుంటూరు మరియు కృష్ణా ప్రాంతాలలో ఉండే పెద్ద పెద్ద వాళ్లతో పేకాట స్టార్ట్ చేశారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారం అని చెప్పడంతో మొదటిలో అపార్ట్మెంట్ కి చాలా మంది జనం వచ్చిన చుట్టుపక్కల ప్రాంతాల వారు పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఆ తర్వాత విషయం వెలుగులోకి రావడంతో, పోలీసుల దృష్టికి వెళ్లడంతో అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు చేపట్టారు. దీంతో పేకాటరాయుళ్లను అరెస్టు చేయడంతో పాటు బీఎండబ్ల్యూ కారును మరియు కొన్ని వాహనాలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే విచారణలో ఈ పేకాట నిర్వహిస్తున్నది గుంటూరు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అనుచరుడు అని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. రియల్ ఎస్టేట్ వ్యాపారం అని చెప్పి పేకాట నిర్వహించడంతో…. గుంటూరు మంగళగిరి అదేవిధంగా రాజధాని ప్రాంతంలో ఉండే పేకాట వ్యసనం ఉండే పేకాటరాయుళ్లు ఇక్కడికి రప్పించి పేకాట నిర్వహించినట్లు విచారణలో బయట పడింది.
అపార్ట్మెంట్ కేంద్రంగా కొన్ని లక్షల రూపాయలు రోజు చేతులు మారుతున్నట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. ఇలా పేకాట క్లబ్ నిర్వహిస్తూ రోజుకి లక్ష నుంచి లక్షన్నర వరకు ఈ ఎమ్మెల్యే అనుచరుడు సంపాదిస్తున్నట్లు పోలీసులు గుర్తించడం జరిగింది. దీంతో తాజాగా చేపట్టిన తనిఖీలలో నాలుగు లక్షల నగదుతో పాటు కొన్ని సెల్ ఫోన్ లను మరియు వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో ఈ వార్త రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. దీంతో ప్రతిపక్ష పార్టీ టిడిపి అధికార పార్టీ వైసీపీ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది. ఇంకా రాష్ట్రంలో బయటపడని పేకాట క్లబ్బులు ఇంకా ఎన్ని ఉన్నాయో అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తుంది. వైసీపీ పార్టీలో కూడా ఇది పెద్ద హాట్ టాపిక్ కావటంతో, జగన్ దృష్టి దాకా వెళ్ళినట్లు, నిందితుడు ఉండవల్లి శ్రీదేవి అనుచరుడు అన్నట్లు తెలియడంతో, జగన్ సీరియస్ అయినట్లు పార్టీ పరువు బాగా చదువుకున్న ఎమ్మెల్యేలా అనుచరులే తీసేస్తున్నారు అని, ఇలాంటివి ఆవిడకి తెలియకుండా జరుగుతాయా అన్నట్టు ఉండవల్లి శ్రీదేవి పై జగన్ సీరియస్ అయినట్లు గుంటూరు రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి.